epaper
Thursday, March 12, 2026
epaper

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!
రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ
రూ.23 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్
రూ.60 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ భవనం
రూ.4 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్
గీతా వృత్తిదారులకు కాటమయ్య రక్షణ కవచాలు
ప్ర‌జా సంక్షేమమే ప్ర‌భుత్వం లక్ష్యం : మంత్రులు పొన్నం, సీత‌క్క‌

కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో రూ.151 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు *వేం నరేందర్ రెడ్డి*తో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, రాష్ట్ర ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్ తదితరులు పాల్గొన్నారు. కేసముద్రం మండల కేంద్రంలో రూ.23 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.60 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ భవన నిర్మాణానికి, రూ.4 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బస్ స్టేషన్ భూమి కోర్టు కేసుల్లో ఉండటాన్ని పరిష్కరించి శంకుస్థాపన చేయడం విశేషమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మౌలిక సదుపాయాల విస్తరణ

కేసముద్రం మున్సిపాలిటీలో రూ.61.86 లక్షలతో రోడ్లు, డ్రైనేజీతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.2 కోట్లతో సేవలాల్ సంత్ బంజారా భవన నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా రోడ్ సేఫ్టీ క్లబ్ లోగోను మంత్రులు ఆవిష్కరించారు. గీతా వృత్తిదారులకు రూ.53.40 లక్షల విలువైన కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేశారు. తమ గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసముద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభినందించి సత్కరించారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, గిరిజన ప్రాంతాలకు మరో వెయ్యి ఇళ్లు అదనంగా ఇచ్చామని చెప్పారు. ఉచిత ఇసుకగా ఎనిమిది ట్రాక్టర్లు అందిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని, మిగిలిన హామీలను కూడా రాబోయే రోజుల్లో అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి, కేసముద్రం మండల కేంద్రం వందల కోట్ల అభివృద్ధి పనులతో కొత్త రూపు దాలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం - కోట్ల రూపాయలు వసూలు...

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోతు. రామచంద్రు నాయక్, కాకతీయ,మరిపెడ:...

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట!

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట! ప్రభుత్వ విప్, జాటోతు. రామచందర్ నాయక్, కాకతీయ,మరిపెడ: ఆరోగ్య...

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కాకతీయ, పెద్దవంగర :...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి *ఏర్పాట్లను పరిశీలించిన...

వచ్చారు వెళ్లారు !

వచ్చారు వెళ్లారు ! తూతూమంత్రంగా నీటి పారుదలశాఖ డీఈ తనిఖీలు అక్రమ తవ్వకాలు కనిపిస్తున్నా,...

స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి

స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి - తహసీల్దార్, ఇంచార్జ్ ఎంపీడీవోకు, ఎస్ఐకి...

కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం

కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం *రూ.13,39,710/- హుండీ ఆదాయం *వివిధ ఆర్థిక సేవల ద్వారా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img