epaper
Sunday, March 8, 2026
epaper

మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళా సాధికారతకు పెద్దపీట
వడ్డీ లేని రుణాలతో ఆర్థిక భరోసా
జ‌న‌గామ క‌లెక్ట‌ర్ రిజ్వాన్ బాషా
రుణాల చెల్లింపులో జిల్లా మహిళలే ముందంజ : ఎమ్మెల్య ప‌ల్లా

కాక‌తీయ‌, జ‌న‌గాం : ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని జనగాం పట్టణంలోని ఓం సాయి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనగాం మున్సిపాలిటీ పరిధిలోని 354 స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.1 కోటి 3 లక్షల విలువైన వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు అనుసంధానం, స్వయం ఉపాధి యూనిట్లు, ఇన్సూరెన్స్, ఉచిత బస్సు ప్రయాణం, వనిత టీ స్టాల్స్, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళతో పాటు దివ్యాంగ మహిళలు కూడా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం తీసుకునేలా ప్రభుత్వం నిబంధనల్లో సవరణ చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాద బీమా, రుణ బీమా ద్వారా మహిళా సంఘ సభ్యులకు భద్రత కలుగుతోందని, జిల్లాలో ఈ బీమా పథకాల ద్వారా రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభించిందని వివరించారు. మహిళలు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి తమ పిల్లలను మంచి భవిష్యత్తుకు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్ సాధించిందని, ఇందులో బాలికలే ముందంజలో ఉన్నారని తెలిపారు. అలాగే పట్టణ పరిశుభ్రత కోసం ప్రజలు తమ వంతు బాధ్యతగా పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు.

రుణాల చెల్లింపులో జిల్లా ముందంజ : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రుణాలు తీసుకోవడంలోనే కాకుండా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో కూడా జిల్లా మహిళలు ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ కృషితో బతుకమ్మ కుంట అభివృద్ధి జరిగి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. మహిళలు తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకునే విధంగా చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను సరైన చోట వేయడం ద్వారా పట్టణ శుభ్రతకు తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం, మున్సిపల్ కమిషనర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..!

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..! అంత‌లోనే అధిష్ఠానం పెద్ద‌ల నుంచి ఫోన్లు కొమ్మాల జాతరకు ర్యాలీగా...

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకానికి ప‌రిపాలనా అనుమతి జీడ‌బ్ల్యూఎంసీ...

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం మంత్రి కొండా సురేఖ ​శివ నగర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ 35వ...

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి కాకతీయ, చెన్నారావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ...

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం కాకతీయ, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీవివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో...

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!? కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు డ్రెస్...

పట్టణాభివృద్ధే లక్ష్యం

పట్టణాభివృద్ధే లక్ష్యం చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణాన్ని అన్ని రంగాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img