తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట!
ప్రభుత్వ విప్, జాటోతు. రామచందర్ నాయక్,
కాకతీయ,మరిపెడ: ఆరోగ్య తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించి పెద్దపీట వేస్తున్నామని,ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు. రామచందర్ నాయక్ అన్నారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా స్పెషాలిటీ హెల్త్ క్యాంపు నిర్వహించారు. సుమారు 420 మంది రోగులకు వివిధ రకాల రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ! కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రజలకు ఇవ్వని వాగ్దానాలను సైతం అమలు చేస్తున్న మన్నారు. ప్రజలకు ఉచిత సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈనెల 20 లోపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. లేనియెడల వారి పేర్లను ఇండ్ల జాబితా నుండి తొలగించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టాలని సర్పంచ్ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు. ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం. సునీత రవీందర్ రెడ్డి, పెండ్లి. రఘువీరారెడ్డి,, తాజుద్దీన్ , రామ్ లాల్, అంబరీష, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తాసిల్దార్ కొండపల్లి. కృష్ణవేణి, ఎంపీ ఓ సోమలాల్ నాయక్, సిడిపిఓ ఎల్లమ్మ, జిల్లా వైద్య శాఖ అధికారి రవిరాథోడ్, మరిపెడ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ గుగులోతు. రవి నాయక్, తొర్రూర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్లు సారంగం, ప్రత్యూష, పవన్ కుమార్, వాటి కౌన్సిలర్లు భాస్కర్, భద్రమ్మ, గౌతంరెడ్డి, మెరుగు. రాము, తదితరులు పాల్గొన్నారు.


