నష్ట పోయిన రైతంగాన్ని ఆదుకోవాలి
బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్
కాకతీయ, నెల్లికుదురు: మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్ అన్నారు. మండలంలోని దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ రైతులను ఓదారుస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వర్షాలకు మండల పరిధిలోని పత్తి, వరి, మొక్కజొన్న, మిరప పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్ట పోయి పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపించి జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివర్ల కొమురయ్య, ఆవుల సాయిమల్లు, భత్తిని నవీన్ రైతులు ఆకుల మల్లేష్, యాసం వెంకన్న,దాసరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


