epaper
Monday, March 2, 2026
epaper

రాజ్యాంగాన్ని గౌరవించని వారు దేశద్రోహులే..

  • విశ్వాసాల ముసుగులో సీజే గవాయ్ పై దాడి దుర్మార్గం
  • ఆ ఘటనను సుమోటోగా తీసుకోకపోవడం బాధాకరం
  • నవంబర్ 1న హైదరాబాదులో భారీ నిరసన ర్యాలీ
  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

కాకతీయ, ఖమ్మం టౌన్: దేశ రాజ్యాంగాన్ని గౌరవించిన వారు, చట్టాలకు విలువనివ్వని వారిని దేశద్రోహులుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ మీదనే బూటుతో దాడి జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరిగి మూడు వారాలు గడుస్తున్నా పోలీసులు మౌనంగా ఉండడం, న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. మానవ హక్కుల కమిషన్ స్పందించలేదన్నారు. అంటే ఈ దేశంలో దళితులకు ఇప్పటికీ రక్షణ లేదని స్పష్టంగా రుజువు అవుతుందన్నారు.

ధర్మం, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా, చట్టాలకు విలువనివ్వకుండా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించని వారు, చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులవుతారని స్పష్టం చేశారు. గవాయ్ స్థానంలో వేరే జస్టిస్ ఉంటే దాడి జరిగేదా అని ప్రశ్నించారు.? గతంలో జార్ఖండ్ లో న్యాయమూర్తిని అవమానించాడని ఐదుగురు జడ్జీల బృందం అర్ధగంటలో న్యాయవాదిపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అలాగే పోలీసు కస్టడీలో ఉన్న రౌడీషీటర్ రియాజ్ ఎలా చనిపోతాడని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులో దాడి జరిగితే సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. గవాయిపై జరిగిన దాడిని, దళితులందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తూ.. దళితుల ఆత్మగౌరాన్ని కాపాడుకోవడానికి, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగ పరిరక్షణకు నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిరసన ర్యాలీ జరుగుతుందని తెలిపారు. కుల, మత, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో ఖమ్మం జిల్లా ఇంచార్జి కందికట్ల విజయ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూరుగంటి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు చిలక నాగరాజు, గొల్లమందల ముత్తారావు, తోళ్ళ సురేష్, తూరుగంటి రాము, బాకి శ్రీను, కనకం జనార్ధన్, చింతిరాల నాగభూషణం, కొలికపోగు ప్రభు, సూరేపల్లి నాగేశ్వరరావు, తోళ్ళ వెంకన్న, పొట్టపింజర బాలస్వామి, పార్షపు ఇనుక, పగిడిపల్లి రవీందర్, మాదాసు వెంకన్న, లంజపల్లి భద్రం, పడిశాల నాగేశ్వరరావు, కుక్కల లక్ష్మయ్య, చిర్రా ఉపేందర్, స్వామి, చాగంటి నరసింహారావు, రాజు, నాగేశ్వర్రావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ కాకతీయ, కారేపల్లి: ఖమ్మం...

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామ...

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్ కాకతీయ, కారేపల్లి: కరువు కాటుతో పంటలు...

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరి...

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img