యాకూబ్ పాషాను శిక్షించాలి -ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
బాలికలపై అఘాత్యాలకు పాల్పడిన అటెండర్ యాకూబ్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి
– బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యాకూబ్ పై ఆరోపణలు
– నిందితుడు యాకూబ్ పాషాపై చర్యలకు ఎమ్మెల్సీ మల్క డిమాండ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ బిజెపి ఎమ్మెల్సీ మల్క కోమరయ్య మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు.కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పని చేస్తున్న యాకూబ్ పాషా బాలికల బాత్రూం లలో రహస్య కెమెరాలను అమర్చి వారి ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించినట్లు, వాటిని అడ్డుపెట్టుకొని బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పందిస్తూ “బాలికలపై ఇలాంటి దారుణలకు పాల్పడిన అటెండర్ యాకూబ్ పాషాను కఠినంగా శిక్షించాలని ” ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు..


