epaper
Saturday, November 15, 2025
epaper

ఫిరాయింపుల‌పై యాక్షన్ !

  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ పునఃప్రారంభం
  • విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకొని న‌గ‌రానికి చేరుకున్న స్పీక‌ర్‌
  • నేడు ప్ర‌సాద్‌కుమార్ ఎదుట హాజ‌రుకానున్న న‌లుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • ప్రకాశ్‌గౌడ్‌, యాదయ్య, మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల విచారణ
  • గ‌త‌నెల 29నుంచి అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై వాద‌న‌లు
  • ఈనెల 30తో ముగియ‌నున్న సుప్రీం కోర్టు గ‌డువు
  • విచార‌ణ గ‌డువు పొడిగించాల‌ని కోర‌నున్న స్పీక‌ర్ ?
  • ఆస‌క్తిరేపుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు (అక్టోబర్ 24) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను పునఃప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది శాసనసభ్యులపై దాఖలైన ఈ పిటిషన్ల విచారణ ప్రక్రియలో స్పీకర్ వేగంపెంచారు. ఈనెల 30లోగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించ‌డంతో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల వాదనలు, క్రాస్-ఎగ్జామినేషన్స్ పూర్తిచేశారు. రేపటి విచారణ మిగిలిన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చడంలో కీలక మలుపుగా మారనుంద‌ని భావిస్తున్నారు. గ‌త నెల‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీచేసిన స్పీక‌ర్‌.. సెప్టెంబ‌ర్ 29 నుంచి అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై విచార‌ణ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. స్పీక‌ర్ విదేశీ టూర్‌కు వెళ్లే ముందు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై దాఖలైన పిటిషన్లపైన విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన టూర్‌ నేపథ్యంలో విచారణకు విరామం ఇచ్చారు. శుక్రవారం ఆ నలుగురు ఎమ్మెల్యేలమీద దాఖలైన పిటిషన్లపై వాదనలు స్పీకర్‌ సమక్షంలో జరగనున్నాయి.

31వ‌ర‌కు ఆంక్ష‌లు

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (రాజ్యాంగంలోని పదో షెడ్యూల్) కింద స్పీక‌ర్ ఈ విచారణ చేప‌ట్ట‌నున్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వయంగా విచారించే అవకాశం ఉంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ కార్యాలయం కట్టుదిట్టమైన ఆంక్షలు విధించింది. విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, వారి న్యాయవాదులు తప్ప మరెవరికీ అసెంబ్లీలోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారులు (బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు), ప్రతివాదుల (ఫిరాయింపు ఎమ్మెల్యేలు) న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచార‌ణ నేప‌థ్యంలో ఈనెల 31వ‌ర‌కు అసెంబ్లీలో ఆంక్ష‌లు విధించారు.

సుప్రీం ఆదేశాల‌తో..

బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన ఈ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరగడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. రేపటి షెడ్యూల్‌లో ఒక్కో ఎమ్మెల్యే కేసుపై విడివిడిగా విచారణ చేపట్టనున్న‌ట్లు స‌మాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఫిర్యాదుదారుల నుంచి న్యాయపరమైన వివరణలు, ఆధారాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోనున్నారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌

మొదటి దశలో నలుగురు ఎమ్మెల్యేల విచారణను విజయవంతంగా పూర్తి చేసిన స్పీకర్, రేపు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల వాదనలను విననున్నారు. ఈ కీలక ఘట్టం పూర్తి అయిన వెంటనే అనర్హత అంశంపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. స్పీకర్ తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ వారిపై అనర్హత వేటు పడితే, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. రేపటి విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img