epaper
Monday, March 2, 2026
epaper

‘ఏసీబీ’ పేరుతో ఘరానా మోసం

  • ఆర్టీఏ అధికారి నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు
  • ఆన్లైన్ మోసాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీ ప్రకటన

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆన్లైన్ మోసలతో మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం గా కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులమని నమ్మించి వరంగల్ ఆర్టీఏ అధికారి నుంచి ఏకంగా దుండగులు రూ.10.20 లక్షలు కాజేశారు. కొద్ది రోజుల క్రితం వరంగల్ ఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, అవినీతికి సంబంధించిన కొన్ని అంశాలను గుర్తించారు. ఈ తనిఖీల గురించి తెలుసుకున్న కేటుగాళ్లు ‘హలో నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్నాను, మీరు లంచం బాగా తీసుకుంటున్నరట, మీ మీద మాకు ఫిర్యాదు వచ్చింది సెటిల్మెంట్ చేసుకోండి.

అర్జెంటుగా డబ్బులు ఆన్లైన్లో అకౌంట్ కు పంపించండి’ అంటూ ఓ అగంతకుడు వరంగల్ జిల్లాలో ఇద్దరు అధికారు లకు ఫోన్లు చేశాడు. అవినీతి కేసులో అరెస్టు కాకుండా ఉండాలంటే తాము అడిగినంత డబ్బు చెల్లించాలని ఆర్టీఏ అధికారులను బెదిరించారు. ఆందోళన చెందిన ఆర్టీఏ అధికారులు దుండగులకు దశలవారీగా రూ.10. 20 లక్షలు చెల్లించారు. దుండగులతో ఫోన్‌లో మాట్లాడుతున్న క్రమంలో సదరు ఆర్టీఏ అధికారికి అనుమానం వచ్చింది. వెంటనే  నేరుగా అసలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. ఏసీబీ అధికారులు చేసిన విచారణ ద్వారా తాము నకిలీ అధికారుల బారిన పడి మోసపోయామని సదరు ఆర్టీఏ అధికారులు జైపాల్ రెడ్డి గ్రహించారు. అనంతరం మోసగాళ్లపై మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ తరహా మోసాలు కేవలం ఆర్టీఏ అధికారులకే పరిమితం కాలేదు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతి కతను ఉపయోగించి ఉద్యోగులను,సామాన్య ప్రజలను మోసం చేస్తున్నా రు. ఉన్నతాధికారులు లేదా మంత్రుల వాయిస్‌ను ఏఐ ద్వారా సృష్టించి అత్యవసరంగా డబ్బులు అడుగుతున్నారు. బ్యాంక్ ఉద్యోగులు లేదా టెలికాం ఆపరేటర్లమని చెప్పి కేవైసీ అప్‌డేట్ పేరుతో ఓటీపీలు అడిగి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారు లు చెబుతున్నారు. ఏసీబీ, పోలీస్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఐటీ వంటి అధికారిక ఏజెన్సీల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లయితే ముందుగా ఆ అధికారి వివరాలు తీసుకొని ఆ శాఖ అధికారిక కార్యాలయాన్ని సంప్రదించి ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. అధికారిక విచారణలు లేదా ప్రభుత్వ లావాదేవీల కోసం అధికారులు ఎప్పుడూ ఫోన్ ద్వారా డబ్బును లేదా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమని అడగరని తెలిపారు.

వరంగల్ ఘటనపై స్పందించిన ఏసీబీ..
వరంగల్‌లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఆన్లైన్ మోసాలపై నమోదైన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ, బుధవారంప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ పేరిట వెలువడన ప్రకటనలో ఆన్లైన్ కాల్స్ పూర్తిగా మోసపూరిత కాల్స్ అని తెలియజేశారు. ఉద్యోగులు అలాంటి కాల్స్‌ను నమ్మకూడదని, అలాంటి నకిలీ కాల్ చేసేవారికి చెల్లింపులు చేయకూడదన్నారు. ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగి లేదా సామాన్యులకు అలాంటి కాల్స్ వస్తే, వారు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలన్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా తెలియజేయాలన్నారు. ఏసీబీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు.. వాట్సాప్ నెంబర్ 9440446106, ఫేస్బుక్ (తెలంగాణ ఏసీబీ), X/ Twitter (@TelanganaACB).
సంప్రదించవచ్చని తెలియజేశారు. బాధితుడు లేదా ఫిర్యాదుదారుడి పేరు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img