epaper
Saturday, November 15, 2025
epaper

దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీ

  • ములుగు జిల్లా ఎస్పీ శబరీష్
  • నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పోలీసులు చేపట్టిన ‘పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి’ అనే అవగాహన కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పునరావాస సదుపాయాల ప్రభావం వల్ల మరో నలుగురు అజ్ఞాత మావోయిస్టు దళ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు సభ్యులు మడవి కోసి అలియాస్ పైకి (20), మడవి ఎడుమె (21), ముచ్చాకి దేవా (21), మడకం బండి (32) లొంగిపోయి శాంతియుత జీవితాన్ని ఎంచుకున్నారు. వీరిలో ముగ్గురు పార్టీ సభ్యులు కాగా, ఒకరు మిలీషియా కమాండర్‌గా పనిచేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ సరెండర్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున పునరావాస నిమిత్తం నగదు బహుమతులు జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు. ఈ యేడు తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ములుగు జిల్లాలో మొత్తం 84 మంది వివిధ హోదాల్లోని మావోయిస్టులు లొంగిపోయి ప్రజాస్రవంతిలో కలిశారు.

వారిలో డీవీసీఎంఎస్-3, ఏసీఎంఎస్-11, పార్టీ సభ్యులు-28, మిలీషియా కమాండర్లు-32, ఆర్పీసీ-1, డీఏకేఎం ఎస్/కే ఏ ఎం ఎస్-2, సీఎన్ ఎం-7 మంది ఉన్నారని ఎస్పీ తెలిపారు. వీరందరికీ ప్రభుత్వ పునరావాస పథకంలో భాగంగా తగిన ఆర్థిక, వైద్య సామాజిక సదుపాయాలు అందజేయబడుతున్నాయని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో క్రింది స్థాయి క్యాడర్లు పై నాయకత్వంపై అసంతృప్తితో రహస్య జీవితం వదిలి కుటుంబాలతో కలిసి ప్రశాంత జీవితం గడపడానికి ముందుకు వస్తున్నారని ఎస్పీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తోందని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం పూర్తి భద్రత తదితర అవసరమైన సహకారం అందిస్తోంది అని ఎస్పీ పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img