epaper
Saturday, November 15, 2025
epaper

య‌థేచ్ఛ‌గా ఇసుక దందా

  • ఇందిరమ్మ ఇళ్ల‌ పేరిట అక్ర‌మ ర‌వాణా
  • ఒక్కో కూప‌న్ మీద ప‌దుల ట్రిప్పుల త‌ర‌లింపు
  • ప‌ర్య‌వేక్ష‌ణ లోపంతో పెరుగుతున్న‌ అక్ర‌మ ర‌వాణా
  • దందాలో అధికార పార్టీ నేత‌ల‌దే పైచేయి
  • ప‌క్క‌దారి ప‌డుతున్న ఇందిర‌మ్మ ప‌థ‌కం ఇసుక పాల‌సీ
  • జేబులు నింపుకుంటున్న ఇసుకాసురులు

కాకతీయ ఆదిలాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధాన అమ‌లుపై ప‌ర్య‌వేక్ష‌ణ క‌రువ‌వ‌డంతో అక్ర‌మాల‌కు దారిగా మారింది.పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు జారీచేస్తున్న ఒక్కో కూప‌న్ మీద ప‌దుల సంఖ్య‌లో ట్రాక్ట‌ర్ ట్రిప్పుల ఇసక‌ను వాగుల్లోంచి అక్ర‌మార్కులు తోడేస్తున్నారు. బ‌హిరంగ మార్కెట్‌లో ట్రాక్ట‌ర్ ట్రిప్పు ధ‌ర రూ.4 నుంచి 5వేల వ‌ర‌కు ఉండ‌టంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని కొంత‌మంది చోటా మోటా లీడ‌ర్ల‌కు ఈ దందా క‌ల్ప‌త‌రువుగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇచ్చోడ, బజార్ హత్నూర్, బోథ్, సిరికొండ,గుడిహత్నూర్, నేరడిగొండ మండలాలతో పాటు పట్టణానికి 3,500ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతితో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టపగలు ఇసుక అక్రమ రవాణాజోరుగా జరుగుతోంది. దీంతో ఇసుక వ్యాపారులకు ఇందిరమ్మ ఇళ్లు కాసులు కురిపిస్తున్నాయి. అడ్డగోలుసంపాదనకు మార్గం సుగమం చేసిన ఇందిరమ్మ ఇళ్లపథకం ఇసుకాసురుల జేబులు నింపుతోంది. అధికారులు మాత్రం పర్మిషన్ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ఇసుక రవాణా చేసేవారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ ఆశయానికే కాదులబ్ధిదారుల ఆశల కు ఇసుక వ్యాపారులు గండికొడుతున్నారనే విమర్శలున్నాయి.

పేరుకే అనుమతులు

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులు తీసుకొచ్చినట్రాక్టర్లకు రోజుకు 2 నుంచి 4 టిప్పుల ఇసుకకు పర్మిషన్ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తూ పర్మిషన్ ఇస్తున్నారు. కానీ, ట్రాక్టర్లయజమానులు మాత్రం ఇచ్చిన కూపన్ ను దగ్గర పెట్టుకొనినాలుగు, ఐదు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నన్నారు. ఉదయం 10 గంటల తర్వాతనే వెళ్లాలని, సాయంత్రం 5గంటల తర్వాత ఇసుక తీయరాదనే నిబంధన ఉన్నా ట్రాక్టర్ల యజమానులు ప్రతి రోజూ తెల్లవారు జాము నుంచే తరలిస్తున్నారు.

అధికారుల నిఘా కరువు..

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ఇచ్చోడ, బజార్ హత్నూర్, బోథ్, సిరికొండ, గుడిహత్నూర్, నేరడిగొండ మండలాల్లో ఉన్న కాగ్నా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర గ్రామాలకు ఇసుక తరలిస్తున్నారు. ఇసుక త‌ర‌లింపుపై ఫిర్యాదులు వెళ్లినా అధికారులు చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ తీసుకొని ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

దందాలో అధికార పార్టీ నాయకులే

బోథ్ నియోజకవర్గం వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుకఅక్రమ రవాణాను అధికార పార్టీ నాయకులే పెంచిపోషిస్తున్నట్లు విమ‌ర్శ‌లున్నాయి. మార్కెట్లోఒక్కో ట్రాక్టర్ రూ. 5 వేలకు ధర పలుకుతుండడంతోఅధికార పార్టీకి చెందిన కొంత మంది బడా, చోటా మోటానాయకులంతా అక్కడ ఇసుక మాఫియా పైనే దృష్టిసారించారు. దీంతో ఈ అక్రమ ఇసుక వ్యాపారం 3 ట్రాక్టర్లు30 ట్రిప్పులుగా సాగుతోంది. పంచాయతీ కార్యదర్శులు ఇస్తున్న కూపన్లను పట్టుకొనిట్రాక్టర్ల యజమానులు ప‌దుల సంఖ్య‌లో ట్రిప్పుల ఇసుక‌ను త‌ర‌లిస్తున్నారు. ట్రాక్టర్కు ఒక కూ పన్ మాత్రమేపంచాయతీ కార్యదర్శులు ఇస్తున్నారు. సిబ్బంది వచ్చినతర్వాత తీసుకెళ్లే ఇసుకకు మాత్రం కూపన్లు చూపిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img