epaper
Thursday, January 15, 2026
epaper

పోరుకు జై కొట్టిన బీసీలు..

  • 42% రిజర్వేషన్ కోసం కదం తొక్కిన ఓరుగల్లు

కాకతీయ, వరంగల్ బ్యూరో : మేమెంతో… మాకంత! అనే నినాదంతో హనుమకొండ వీధులు మారమోగాయి. ఓబీసీ చైర్మన్, మాజీ కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో సబ్బండ కులాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, కార్మికులు, దళిత, మైనారిటీ సంస్థలు కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఏకమయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అదాలత్ సెంటర్‌ వరకు భారీ ర్యాలీగా కదిలిన బీసీ ఉద్యమ కవాతు ఊరంతా హోరెత్తించింది. సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు, మేధావులు, బీసీలు కలిసి పోరాడి రాష్ట్రాన్ని సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే 42 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని అన్నారు.

విద్యార్థుల కదలికతో ఊగిపోయిన ఓరుగల్లు..

అంబేద్కర్‌ సెంటరు నుంచి అమరవీరుల స్మారక స్థూపం వరకు సాగిన కవాతులో విద్యార్థులు చీమల దండులా కదిలారు. రెండు గంటల పాటు కాళోజీ సెంటర్, ఎన్పీడీసీ ఎల్ ఆఫీస్ మీదుగా సాగిన ర్యాలీ నగరాన్ని స్తంభింపజేసింది. ర్యాలీకి ముందే పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏసీపీ, ముగ్గురు సీఐలు, పలువురు ఎస్సైలు పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ సజావుగా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి.

డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..

హనుమకొండ బస్ డిపో ఎదుట ఉదయం నుంచే బీసీ ఉద్యమకారులు ధర్నా నిర్వహించారు. సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులు, మహిళా సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు బస్సులను బయటకు వెళ్లనీయకుండా నిరసన చేపట్టారు. బీసీ ఉద్యమం ఇక బహుజన సమరంగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఉద్యమ పట్టుగొమ్మ ఓరుగల్లు..

విద్యార్థులు, మేధావులు, సామాజిక సంస్థలు, కార్మికులు కలిసి శనివారం బీసీ బంద్‌ ను ప్రజా సమరంగా మార్చారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ర్యాలీ, రాష్ట్రవ్యాప్తంగా బీసీల హక్కుల పోరాటానికి నాంది పలికింది. కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, వేణుమాధవ్, మౌనిక గౌడ్, తీగల భరత్ గౌడ్, రాజేష్ కుమార్, బోనగాని యాదగిరి గౌడ్, రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img