epaper
Saturday, November 15, 2025
epaper

పూరన్ కుటుంబానికి అండగా ఉంటాం..

  • దళిత ఐపీఎస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
  • ప్రధాని లేఖ రాసిన నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన డీజీపీ, ఇతర పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ప్రధాని మోదీకి లేఖ రాశారు. పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంలో లేఖను అందజేసిన అనంతరం.. ఎంపీ మల్లు రవి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు.

చాలా దురదృష్ట‌క‌రం

‘హర్యానాలో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐఎంలలో చదివి.. అతి చిన్న వయస్సులోనే సివిల్స్ రాసి ఐపీఎస్ అధికారి అయ్యారు. రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన పైఅధికారుల ఒత్తిడి కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అతని సూసైడ్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరాం. అలాగే.. మరోచోట ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం’ అని మల్లు రవి వివరించారు. ‘ఆత్మహత్య చేసుకొని వారం గడుస్తున్నా.. ఇంకా పోస్టుమార్టం జరగలేదు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు కారణమైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అతని భార్య, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డీజీపీని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా హోంమంత్రి వారి డిమాండ్లను అమలు చేయాలి. షెడ్యూల్ క్యాస్ట్ పార్లమెంట్ మెంబర్‌గా నేను కూడా డిమాండ్ చేస్తున్నా. దీనికి సంబంధించిన లెటర్‌ను కూడా ప్రధాని కార్యాలయంలో అందజేశాం’ అని ఎంపీ చెప్పారు.

వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి

‘ఆత్మహత్యకు పాల్పడ్డ ఐపీఎస్ అధికారి కుటుంబ సభ్యులకు కూడా లేఖ రాశాం. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చాం. దేశంలోని దళితులందరూ మద్దతుగా నిలుస్తారని లేఖలో ధైర్యాన్నిచ్చాం. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ మీటింగ్‌లో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇవాళ కమిటీ సమావేశం జరగనుంది. ఐపీఎస్ అధికారి సూసైడ్ ఘటనను కమిటీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్తా. బాధ్యులైన డీజీపీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతా. అంతేకాకుండా నేషనల్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు కూడా దీని గురించి వివరిస్తా. ప్రధానికి రాసిన లేఖను అందజేస్తా. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరతా. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఈ లేఖలను పంపిస్తా. అంతేకాకుండా.. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలను కలుస్తా. అందరం కలిసి ప్రధాని, హోంమంత్రిని కలిసి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేయాలని వారికి తెలియజేస్తాం. అవసరమైతే వారి అందరితో కలిసి చండీఘర్ వెళ్తాం. వారి కుటుంబానికి అండగా నిలుస్తాం.’ అని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img