epaper
Saturday, November 15, 2025
epaper

శబరిమల ఆలయంలో బంగారం చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

  • బండి సంజయ్‌కు కరీంనగర్ అయ్యప్ప సేవా సమితి విన‌తి

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : శబరిమల శ్రీ ధర్మశాస్త దేవస్థానంలో బంగారు ఆభరణాల చోరీ, దేవాలయ ఆస్తుల దుర్వినియోగం, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా అయ్యప్ప సేవా సమితి సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు కె. పరమేశ్వర్ గురుస్వామి, పి. సత్యనారాయణ గురుస్వామి, జి. నాగరాజు గురుస్వామి, పి. సాయన్న గురుస్వామి తదితరులు బండి సంజయ్‌ను కలిసి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ సీబీఐ పర్యవేక్షణలో ఆడిట్ చేపట్టాలని కోరారు. శబరిమల ఆలయంలో 1999లో ఉపయోగించిన 1.5 కిలోల బంగారాన్ని రాగిగా రికార్డు చేయడం, బంగారు కవచాన్ని ప్రైవేట్ సంస్థకు తరలించి కస్టోడియల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం వంటి విషయాలు హైకోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ఎస్ఐటీ విచారణలో వెలుగుచూశాయని వారు గుర్తుచేశారు. శబరిమల ఆలయంలో జరిగే అక్రమాలు కేవలం ఆర్థిక అవినీతి కాదు, కోటిమందికి పైగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘోర నేరంగా పరిగణించాలని సమితి తెలిపింది. ఆలయ ఆస్తులపై సీబీఐ పర్యవేక్షణలో ఆడిట్ జరపాలని, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దేవాలయ ఆస్తుల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని, ఆస్తుల నిర్వహణను డిజిటల్ పబ్లిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ద్వారా చేపట్టాలని వారు కోరారు. శబరిమల ఆలయానికి కేంద్ర సాంస్కృతిక వారసత్వ రక్షణ హోదా కల్పించాలని కోరారు. భక్తులు ప్రతి ఏటా 41 రోజుల దీక్షతో, ఇరుముడితో శబరిమల యాత్ర చేపడతారని, అలాంటి పవిత్ర స్థలంలో అక్రమాలు జరగడం బాధాకరమని వారు వాపోయారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img