epaper
Thursday, January 15, 2026
epaper

మాస్టర్ ప్లాన్‌తో గ్రామాల అభివృద్ధి

  • ప్రజా ప్రభుత్వ లక్ష్యం నాణ్యమైన విద్య
  • గుత్తికోయ గూడెంలో పాఠశాల భవనాల ప్రారంభం
  • ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా అభివృద్ధి పథంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం ఏటూరు నాగారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు, అలాగే ఏడున్నర కోట్ల రూపాయల బస్ డిపో నిర్మాణానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మాస్టర్ ప్లాన్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు.

ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్‌గా, ఐదు మండలాల కేంద్రంగా ఉన్నందున దీనిని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశాం అన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టాం అని తెలిపారు. బస్సు డిపో ఏర్పాటుతో ప్రాంతీయ రవాణా వ్యవస్థకు ఊపిరి వస్తుందన్నారు. ఏటూరు నాగారం నుంచి గోదావరి వరకు రెండున్నర కోట్లతో సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఏటూరు నాగారంలో ప్రతిష్టాత్మకంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాబోయే రోజుల్లో గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ వంటి అభివృద్ధి పనులను కూడా చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని కొండపర్తి క్రాస్, చేన్నాపురం తోగు, లవ్వల స్టేజీ, జలగలంచ ప్రాంతాల్లో మూడు లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని, గుత్తికోయ పిల్లలకు చదువు అందించాలనే ఉద్దేశంతో అడవి ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే అన్ని గుత్తికోయ హాబిటేషన్లలో సోలార్ లైట్స్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. జలగలంచ ప్రాంతం రహదారికి దగ్గరగా ఉండటం వల్ల పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. అనంతరం గుత్తికోయ చిన్నారులతో మంత్రి ముచ్చటించడం చిన్నారుల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాలలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img