epaper
Monday, March 2, 2026
epaper

దిక్కుమాలిన ప్ర‌భుత్వం

  • విద్యా వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించింది
  • విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్‌.. అధ్యాప‌కులకు జీతాలు లేవ్‌
  • పిల్ల‌లు క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర ధ‌ర్నా చేసే దుస్థితి దాపురించింది
  • వెంట‌నే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలి
  • మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం సెంట్రల్ దగ్గర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి నరేష్ యాదవ్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కాలేజీ, స్కూలు యాజమాన్యాలు అనేకసార్లు అల్టిమేటం ఇచ్చినా ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేద‌న్నారు. ప్రజల పట్ల బాధ్యత, నిజాయితీ లేదు.
లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆక్రందన కాబట్టి మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఈ వేదిక నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. తాత్సారం చేయకుండా.. శషబిశలు లేకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి నీకు నిధులు ఉన్నాయి. కానీ వీరికి ఇవ్వడానికి లేవా ?
కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే మీకు కమిషన్లు వస్తాయి. వాటిని ఢిల్లీకి పంపించుకోవచ్చు అనుకుంటున్నారు. అంటూ మండిప‌డ్డారు.

నిల‌దీస్తాం..

కాలేజీ, స్కూలు యాజమాన్యాలు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేద‌ని ఈట‌ల ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మాస్టర్స్ కోసం, ఉద్యోగాల కోసం వెళ్దామంటే సర్టిఫికెట్లు రాక సొంత డబ్బులు అప్పులు చేసి కట్టుకొని సర్టిఫికెట్ తీసుకుంటున్నార‌న్నారు. అంత గంభీరమైన సమస్య అయినా ప్రభుత్వం ఆలోచన చేయడం లేద‌న్నారు. గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేద‌న్నారు. పిల్లలకు డైట్ చార్జీలు లేవు.
ఏజెన్సీలకు డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నం పెట్టలేక కలెక్టరేట్ల ముందట ధర్నా చేసే పరిస్థితి వచ్చింద‌ని మండిప‌డ్డారు. విద్యావ్య‌వ‌స్థ‌పై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంద‌న్నారు. విద్యా వ్యవస్థలో పదివేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయ‌న్నారు. రీ యంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామ‌ని హెచ్చ‌రించారు.

దుర్మార్గ‌మైన స‌ర్కార్‌

మధ్యతరగతి పేద పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోవడానికి పెట్టిన స్కీం ఫీజు రియంబర్స్మెంట్.
కేసీఆర్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు బకాయిలు పెట్టారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండేళ్లయినా చెల్లించలేదు. నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పిల్లల‌పై చదువులకు పోవడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి తల్లిదండ్రులే మళ్లీ ఆ డబ్బులు కట్టి అప్పులు చేసి బజారున పడే పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక సమ్మెకు నోటు ఇస్తే పదివేల కోట్లలో 600 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాల కు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లకు స్టాఫ్ కు జీతభత్యాలు లేవు. ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ల పేరుట కొన్ని వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. ఆ పిల్లలకు సంవత్సరానికి 42 వేల రూపాయలు ఇస్తారు. వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఎంత దిక్కుమాలిన ప్రభుత్వమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ చార్జీలు చెల్లించకపోతే సప్లయర్స్ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img