epaper
Monday, March 2, 2026
epaper

ప‌ప్పు దినుసుల సాగు పెంచాలి

  • దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడంలో రైతులది ముఖ్య పాత్ర
  • ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను పండించాలి
  • పదేళ్లలో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 13 లక్షల కోట్లకుపైగా సబ్సిడీలు ..
  • పీఎం ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాని మోడీ

కాక‌తీయ, నేష‌న‌ల్ డెస్క్ : భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే వరి, గోధుమ పంటలతోపాటు ప్రొటీన్ అధికంగా లభించే పప్పుల సాగును మరింత పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆయన పీఎం ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను మన దేశంలో పండించాలని పిలుపునిచ్చారు. దేశంలో పంటల ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి రూ. 5 లక్షల కోట్ల సబ్సిడీలు ఇస్తే, తమ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ. 13 లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చిందని ఆయన తెలిపారు.

నిరంత‌రం కొత్త మార్పులు రావాలి

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అన్ని రంగాల్లో నిరంతరం కొత్త మార్పులు చోటుచేసుకోవాలని మోదీ అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి వదిలేసిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేస్తోందని తెలిపారు. వీటన్నింటినీ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన కిందకు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో గత పాలకులు రోడ్లు వేయించలేదని, అలాంటి ప్రాంతాలను తమ ప్రభుత్వం డిజిటల్ ఇండియా దిశగా నడిపిస్తోందని అన్నారు. గత పదకొండేళ్లలో రైతులు పలు విజయాలు సాధించారని, పదివేలకు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయని తెలిపారు.

రైతుల కోసం రెండు కొత్త ప‌థ‌కాలు..

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం రూ.35,000 కోట్లకు పైగా అవుట్‌లేతో రెండు ప్రధాన కొత్త పథకాలను ప్రారంభించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన (అవుట్‌లే: రూ.24,000 కోట్లు) కింద 100 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యం, పంటకోత అనంతర నిల్వను బలోపేతం చేయడం , రుణ లభ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించబడింది. మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (అవుట్‌లే: రూ.11,440 కోట్లు) కింద పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచి, సాగు విస్తీర్ణాన్ని విస్తరించి, విలువ గొలుసును (కొనుగోలు, నిల్వ, ప్రాసెసింగ్) బలోపేతం చేయడం ద్వారా పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించడం ఈ మిషన్ లక్ష్యం. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ పప్పు ధాన్యాల సాగు చేస్తున్న రైతులతో కూడా ముచ్చటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img