epaper
Thursday, January 15, 2026
epaper

వేధింపులు భరించలేక హత్య

  • 24 గంటల్లో నిందితుల అరెస్ట్
  • రిమాండ్ కు తరలింపు
  • వివ‌రాలు వెల్ల‌డించిన ఏసీపీ ఎం. ర‌మేష్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : పెద్దపల్లి జోన్ రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ డీఆర్‌డీఏ, టీజీఎస్ఇఆర్ఎఫ్ కార్యాలయం సమీపంలో శుక్రవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ శనివారం మీడియాకు వెల్లడించారు. న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన హతుడు కోట చిరంజీవి (35) పోతనకాలనీలో మీ సేవా కేంద్రం నడుపుతున్నాడు. అతని భార్య 2019లో మృతిచెంద‌డంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఓ రోజు పని నిమిత్తం తన మీ సేవా కేంద్రానికి వచ్చిన పొలవెన సంధ్యారాణిని పరిచయం చేసుకున్నాడు.

అప్పటి నుండి ఆమెను ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా వేధిస్తూ, ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తిరస్కరించిన ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఏసీపీ తెలిపారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి చేష్టలపై నిందితురాలు సంధ్యారాణి ఆమె భర్త పొలవెన కుమార్‌కు తెలుపగా మృతుడు చిరంజీవి, కుమార్ ను కూడా ఫోన్ ద్వారా బెదిరించడం మొదలుపెట్టాడు. నెల క్రితం ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ చిరంజీవి ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సంధ్యారాణికి తనతో పెళ్లి జరిగిందని, ఇద్దరం కలిసి లేచిపోయామని చెడుగా ప్రచారం చేశాడు. కాగా ఈ నెల 10న మృతుడు, ఆమె పనిచేసే సెంటినరీ కాలనీ సమాఖ్య కార్యాలయం వద్దకు వచ్చి గొడవకు దిగాడంతో సంధ్యారాణి తన భర్త, అన్నయ్య, తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని తెలియపరిచింది.

అక్కడికి వచ్చిన మల్లయ్య, నరేష్, కుమార్, చందు చిరంజీవిపై దాడి చేశారు. అనంతరం మల్లయ్య ఇనుప రాడ్డుతో చిరంజీవి తలపై పొడువగా తీవ్ర గాయాల‌తో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు కోట రాం చరణ్ ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితులు మోటార్ సైకిళ్లపై వెళుతున్నార‌నే నమ్మదగిన సమాచారం మేర‌కు పెంచికల్ పేట్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు బైకులు, ఇనుప రాడ్డు, చాకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img