- బీఆర్ఎస్ నాయకుడు యరసంగి పాపయ్య గౌడ్
కాకతీయ, బయ్యారం : మాయ మాటలు చెప్పి బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు హైకోర్టు తీర్పు ద్వారా పటాపంచలయ్యాయని బీఆర్ఎస్ నాయకుడు యరసంగి పాపయ్య గౌడ్ అన్నారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారే.. తప్పా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు చట్ట బద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారన్నారు. బీసీల పట్ల వారికి నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపి, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు విషయంలో ఢిల్లీలో కొట్లాడి, పార్లమెంట్ లో చట్టం చేయించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.


