- ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకుడు పాయం నాగేశ్వరరావు
కాకతీయ , నూగూరు వెంకటాపురం : కొమరం భీమ్ 85వ వర్ధంతి సందర్భంగా ఆదివాసి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి ఆదివాసి నాయకులు పాయం నాగేశ్వరరావు , పశువుల సూర్యనారాయణ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమురం భీమ్ ఆదివాసుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసిల ఉద్యమం ప్రారంభించిన మహనీయుడని కొనియాడారు. ఆశయాల సాధన కోసం, హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి అమరుడైన వీరుడ చూపిన బాటలో నడవాలని ఆదివాసిలకు పిలుపునిచ్చారు.
ఐదవ షెడ్యూల్డ్ ఏరియాలో స్థానిక సంస్థల ఎలక్షన్ లో గిరిజనేతరుల రిజర్వేషన్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను వెంటనే తొలగించి, 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూనెం రామచందర్రావు, పర్సిక సతీష్, చింత సోమరాజు, చింత సమ్మయ్య, కుచ్చంటి చిరంజీవి, ఇర్ప లక్ష్మి , సొర్లం నరసమ్మ, అట్టం అంజలి కుమారి, కనితి వెంకటకృష్ణ, కుంజమహేష్, తుర్స కృష్ణ బాబు, తాటి రాంబాబు, ఉండం రామచంద్ర ప్రసాద్, దీపక్, నాగరాజు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.


