epaper
Saturday, November 15, 2025
epaper

భారత్‌కు నీరవ్‌మోదీ అప్పగింతకు లైన్ క్లియర్.!!

కాకతీయ, నేషనల్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను వేల కోట్లు మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అతన్ని భారత్ కు రప్పించేందుకు మార్గం సుగుమమైందని తెలుస్తోంది. నవంబర్ 23న నీరవ్ ను భారత అధికారులకు అప్పగించే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు అప్పగింత ప్రక్రియకు సంబంధించి ఇటీవల ఓ హామీ పత్రాన్ని కూడా సమర్పించింది. నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చిన తర్వాత కేవలం మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారణ జరుపుతామని ఇతర కస్టడీకి అప్పగించబోమని ఆ పత్రంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ , కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందించాయి. భారత్ కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచుతారని..హై ప్రొఫైల్ ఖైదీలకు లభించే అన్ని సౌకర్యాలను కల్పిస్తారని పత్రంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ నీరవ్ మోదీ ఇటీవల మరోసారి లండన్ కోర్టును ఆశ్రయించారు. తనను భారత్ కు అప్పగిస్తే దేశంలోని అనేక విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాని నీరవ్ మోదీ అభ్యర్థించారు. లండన్ కోర్టు ఈ పిటిషన్ను పరిగణలోనికి తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించగా..దీన్ని పరిశీలించిన న్యాయస్థానం నవంబర్ 23న తదుపరి విచారణ సమయంలో అతన్ని భారత్ కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సదరు కథనాలు తెలిపాయి. తప్పుడు ఎల్ వోయూలతో పీఎన్బీని నీరవ్ మోసం చేసిన వ్యవహారం 2018 జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే అప్పటికే నీరవ్ దేశం విడిచి పారిపోయారు. ఈడీ అతన్ని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.

2018 డిసెంబర్ లో నీరవ్ తమ దేశంలో నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు తెలిపింది. దీంతో అతన్ని అప్పగించాలని భారత్ విజ్నాప్తి చేసింది. 2019 మార్చిలో నీరవ్ అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతన్ని భారత్ కు అప్పగించడాన్నికి 2021లో నాటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ కోర్టు దాన్ని తిరస్కరించింది. బెయిల్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసినప్పటికీ ప్రతిసారీ భంగపాటే ఎదురైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాక‌తీయ‌, జాతీయం: బీహార్ అసెంబ్లీ...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌! ఫరీదాబాద్ మాడ్యూల్...

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే...

ఎన్‌డీఏదే బీహార్… మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం

ఎన్‌డీఏదే బీహార్ ప‌నిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు మహాఘట్...

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! కాక‌తీయ‌, జాతీయం : దేశ...

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా? కాక‌తీయ‌, జాతీయం : దేశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img