epaper
Sunday, March 1, 2026
epaper

బిహార్ తుది జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తుది జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 3.8 శాతం తగ్గి 15.5 లక్షలు తగ్గగా, మహిళా ఓటర్ల సంఖ్య 6.1 శాతం తగ్గి 22.7 లక్షలు తగ్గింది. అంటే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా తొలగించారు. ఈ పరిస్థితి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బిహార్ రాజకీయాల్లో మహిళా ఓటర్లు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తారు.

మహిళా ఓటర్ల తొలగింపులో గోపాల్‌గంజ్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 15.1 శాతం అంటే 1.5 లక్షల మహిళలు జాబితా నుంచి తొలగించారు. జనవరిలో ఇక్కడ మహిళా ఓటర్లు 10.3 లక్షలుగా ఉండగా, తుది జాబితాలో 8.3 లక్షలకు తగ్గారు. రెండో స్థానంలో మధుబని జిల్లా (1.3 లక్షలు), మూడో స్థానంలో పూర్వి చంపారన్ (1.1 లక్షలు) ఉన్నాయి. అలాగే సారణ్, భగల్‌పూర్ జిల్లాల్లో కూడా ఒక్కో లక్ష మహిళలు జాబితా నుంచి తొలగించబడ్డారు. ఆసక్తికరంగా ఈ జిల్లాలు అన్నీ పొరుగు రాష్ట్రాలు లేదా దేశాలకు సరిహద్దుగా ఉన్నాయి.

పురుష ఓటర్లలో కూడా తొలగింపులు జరిగాయి కానీ సంఖ్య మహిళలతో పోలిస్తే తక్కువ. మధుబని జిల్లాలో 95,000 పురుషులు, పాట్నాలో 90,000, సారణ్‌లో 86,000, పూర్వ చంపరన్‌లో 85,000, గోపాల్‌గంజ్‌లో 80,000 మంది పురుష ఓటర్లు జాబితా నుంచి తొలగించారు. మహిళా, పురుష ఓటర్లు ఎక్కువగా తొలగించబడిన ఆరు జిల్లాలు ఉన్నాయి. అవి గోపాల్‌గంజ్, మధుబని, పూర్వి చంపరన్, సారణ్, భగల్‌పూర్, పాట్నా. వీటిలో మొత్తం 59 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2020 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో మహాఘట్‌బంధన్ 25 సీట్లు, ఎన్డీయే 34 సీట్లు గెలుచుకున్నాయి.

అయితే గతంలో ఈ నియోజకవర్గాల్లో ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు, సీ‌ఎస్‌డీఎస్ సర్వే ప్రకారం 38% మహిళలు ఎన్డీయేకు, 37% మహిళలు మహాఘట్‌బంధన్‌కు ఓటు వేశారు. ఇక పురుష ఓటర్లలో 36% ఎన్డీయేకు, 38% మహాఘట్‌బంధన్‌కు మద్దతిచ్చారు. అంటే కేవలం 11,500 ఓట్ల తేడాతో ఎన్డీయే ఆధిక్యం సాధించింది.ఇప్పుడు లక్షలాదిమంది మహిళా ఓటర్లను తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో గణనీయమైన మార్పు రావచ్చని భావిస్తున్నారు.

మహిళల ఓటు కీలకమని గుర్తించిన ప్రధాన పార్టీలు ఇప్పటికే వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బిహార్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద 75 లక్షల మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. ఇది మహిళా ఓటర్లపై ప్రభావం చూపుతుందేమో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img