- సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథి
కాకతీయ , మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో 25 ఎంపీటీసీ, 50 సర్పంచ్, 6 జడ్పిటిసి , 150 వార్డు మెంబర్లు స్థానాలలో పోటీకి సన్నద్ధం కావాలని కార్యకర్తలకు సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా అత్యవసర ఎన్నికల సమావేశం వీరభవన్ లో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలోని కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు.
ముఖ్యంగా గత ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సయోధ్యకుదురుచుకొని ముందుకు పోయినట్లు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం చర్చలుజరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమం, మానుకోట జిల్లా ఉద్యమం తరహాలో పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలు సీపీఐ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బి అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మేర విశ్వేశ్వరరావు, నాయకులు పెరుగు కుమార్, కట్లోజు పాండురంగ చారి, చింతకుంట్ల వెంకన్న, వరిపల్లి వెంకన్న, కరణం రాజన్న, నెల్లూరు నాగేశ్వరరావు, తండ సందీప్, చొప్పరి శేఖర్, సారిక శ్రీనివాస్, మారగాని బాలకృష్ణ, జంపాల వెంకన్న, తురక రమేష్, బైస స్వామి, మాలోతు రవీందర్, వీరవెల్లి రవి, కొమ్ము నారాయణ, తూటి వెంకటరెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


