epaper
Thursday, January 15, 2026
epaper

భారతదేశపు ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలు

భారతదేశపు ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలు
ఓబీసీలకు అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ఆవేదన

కాక‌తీయ‌, న్యూ డిల్లీ (జూలై 25) : భారతదేశపు ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. అలాంటి ఓబీసీలకు అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘బాగిదారి న్యాయ మహా సమ్మేళనం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఓబీసీల చరిత్రను ఉద్దేశపూర్వకంగా చెరిపేశారని అన్నారు. 2004 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఈ రెండు దశాబ్దాల కాలం వెనుదిరిగి చూసుకుంటే.. ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం కోసం తాను చేయగలిగినంత చేయలేకపోయానని అనిపిస్తోందని పశ్చాత్తాపం వెలిబుచ్చారు. ఆ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నానని, సమస్యలు సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలమని వ్యాఖ్యానించారు.అందుకోసం చరిత్ర తెలుసుకోవాలని రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో దళితుల చరిత్రను అంబేడ్కర్‌ అర్థం చేసుకున్నారని చెప్పారు. తెలుసుకోవడానికి ఓబీసీల చరిత్ర ఎక్కడుందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఉద్దేశపూర్వకంగా ఆ చరిత్రను చెరిపేశాయని ఆరోపించారు. ఓబీసీలు వారి శ్రమకు తగిన ఫలితాలను అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కార్పొరేట్‌ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారు? మీడియా రంగంలో వారికి స్థానం ఎక్కడుంది?’ అని ఆయన ప్రశ్నించారు.కులగణన కూడా ఎప్పుడో చేయాల్సిందని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తాము తప్పకుండా కులగణన పూర్తిచేస్తామని రాహుల్‌ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా భాషా వివాదంపైనా రాహుల్‌గాంధీ స్పందించారు. అభివృద్ధిలో విద్యే ప్రధానమని, ఇంగ్లిష్‌ నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపవుతాయని చెప్పారు. బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లిష్‌ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ భాషలూ ముఖ్యమేనని, దాంతోపాటు ఆంగ్ల ప్రాధాన్యాన్నీ అర్థం చేసుకోవాలని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img