epaper
Thursday, January 15, 2026
epaper

డెబ్భై యేండ్ల చరిత్ర.. వేలాది జర్నలిస్టుల విశ్వాసం.!

డెబ్భై యేండ్ల చరిత్ర.. వేలాది జర్నలిస్టుల విశ్వాసం.!
ఐక్యత, పోరాటాలు, త్యాగాల పునాదులపై సంఘం నిర్మితం..
జర్నలిజం వృత్తిని పరిరక్షించేందుకు పోరాటాలు ..
టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దాదాపు డెబ్భై యేండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగివుండి, రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల విశ్వాసం చూరగొంటున్న ఘనత దేశంలో తమ సంఘానికి మాత్రమే దక్కిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే సంఘం కార్యకలాపాలకు ఆకర్షితులై, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు ఇవ్వాళ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయానికి తరలివచ్చి విరాహత్ అలీ సమక్షంలో యూనియన్ సభ్యత్వాలు తీసుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఐక్యత, పోరాటాలు, త్యాగాల పునాదులపై తమ సంఘం నిర్మితమైందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పేరుతో లెటర్ హెడ్ లు, విజిటింగ్ కార్డులు సృష్టించి, పైరవీలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే సంఘాలను జర్నలిస్టులు గుర్తించి, వారిని తిరస్కరిస్తూ, తమ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంఘం జెండా పట్టుకొని కదం తొక్కుతున్నట్లు విరాహత్ అలీ అన్నారు.

ప్రశ్నర్థకంగా మీడియా భవిష్యత్తు ..

కొన్ని అరాచక శక్తుల చర్యల మూలంగా ప్రస్తుతం మీడియా భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారిందని, పవిత్రమైన జర్నలిజం వృత్తిని పరిరక్షించేందుకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాలమూరు జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమాన్ని విస్తరింపజేయడంలో తమ సంఘం దివంగత నేతలు రఘురామయ్య, హన్మంత్ రెడ్డిల కృషి చిరస్మరనీయమన్నారు. జిల్లాల విభజనకు ముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో తమ సంఘం సభ్యత్వాలు 400వరకు ఉంటే, జిల్లాల విభజన తర్వాత దాదాపు 1400కు చేరడం బట్టి చూస్తే తమ సంఘం పట్ల జర్నలిస్టులకు ఉన్న విశ్వాసాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని విరాహత్ తెలిపారు. 31జిల్లాల్లో తమ సంఘానికి ఇలాంటి ఆదరణే ఉందని ఆయన స్పష్టంచేశారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రాజేష్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్, మహబూబ్ నగర్ జిల్లా నాయకులు విజయరాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img