epaper
Saturday, November 15, 2025
epaper

ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడాలి

ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడాలి

మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

రైతులు ఎకరానికి రూ. 30 వేలు నష్టపోతున్నారు

అదనంగా బోనస్ ఇచ్చి క్వింటల్ రూ. 2800 కొనుగోలుచేయాలి

రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలి

మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

కాక‌తీయ‌,  నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలను తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజ‌క‌ర్గంలోని వేల్పూర్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో వేముల మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చింద‌ని, దాదాపు 60 శాతం పంట కోయడం జరిగింద‌న్నారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు 1800 లకు కూడా కొనడం లేద‌న్నారు. ప్రైవేట్ వ్యాపారులు 2000 లకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1800 కూడా కొనడం లేద‌ని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింద‌న్నారు. ప్రవేట్ వ్యాపారులు ధర ఇంకా తగ్గించి 1600 లకు కొనే దుస్థితి వస్తుంద‌న్నారు. వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిలువ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చింద‌న్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నార‌న్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చింద‌ని గుర్తుచేశారు. ప్రస్తుతం 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్న పంటను మెరుగైన మద్దతు ధర 400 కలిపి 2800 కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

అన్న‌దాత‌ను ఆదుకోవాలి

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2800 లకు మక్క పంట కొనాలి…కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం వల్ల ప్రస్తుతం ప్రవేట్ వ్యాపారులు ఇస్తున్న ధరతో రైతు ఎకరానికి 1000 రూపాయలు నష్టపోతున్నాడు. ప్రతి ఎకరానికి 30 క్వింటాల్ పంట వచ్చిన ఎకరానికి రూ.30 వేల మక్క పండించే రైతు నష్టపోతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పంట వెంటనే కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుని డిమాండ్ చేశారు. రూ. గతంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నార‌ని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి బీఆర్ఎస్‌ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాడాల్సి వస్తుంద‌ని హెచ్చ‌రించారు. సోయాపంట కడా చేతికోస్తుంది.. ప్రభుత్వం ఇప్పటినుండే పంట కొనుగోలు చేయడానికి ప్రణాళికలు చేసుకోవాల‌ని సూచించారు. మొక్కజొన్న పంట కొనుగోలు కు ఏర్పడిన పరిస్థితులు సొయా పంటకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకోవాల‌ని వేములు విజ్క్ష‌ప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img