epaper
Saturday, November 15, 2025
epaper

ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు పటిష్ట కార్యాచరణ

  • అదనపు కలెక్టర్ డి.వేణు

కాక‌తీయ‌, క‌రీంన‌గర్ బ్యూరో : వానాకాలం 2025 సీజన్ లో ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు వ్యవసాయ శాఖ పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు అంశంలో వ్యవసాయ శాఖ పోషించాల్సిన పాత్ర పై అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం 2025 సీజన్ పంట కొనుగోలు సమయంలో సన్న రకం ధాన్యానికి కనీసం మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యతకు సంబంధించి ఏమైనా వివాదాలు తలెత్తితే వ్యవసాయ విస్తరణ అధికారులు పరిష్కరించాలన్నారు. అదే సమయంలో సన్న ధాన్యం నాణ్యత ను మండల వ్యవసాయ అధికారులు పరిష్కరించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని తగ్గించుటకు గాని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు ఇస్తూ ఒకే సమయంలో కాకుండా దశల వారీగా వరి కోతలు చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వరి కోతలు క్రమ పద్ధతిన జరిగేలా చూడాలని, కోతల సమయంలో హార్వెస్టర్లు 18 కంటే ఎక్కువ ఆర్.పి.ఎం నడిచేలా చూడాలని తద్వారా కోతల సమయంలోనే తాలూ, చెత్త వంటి పదార్థాలు ధాన్యం నుండి వేరు చేయవచ్చని తెలిపారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారికి ట్యాగ్ చేయాలని తెలిపారు. కౌలు, పేద రైతులు, చిన్న కమతాలను సాగు చేస్తున్న రైతులు, ప్రభుత్వ, అటవీ భూములలో పంటలు పండించే చిన్న కారు రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వ లేరని, వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించి తగు ధ్రువీకరణ పత్రంతో 50 క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోలు చేపట్టవచ్చని తెలిపారు. 50 క్వింటాళ్ళకు మించినట్లయితే మండల వ్యవసాయ అధికారి ధృవీకరించాల్సి ఉంటుందని అద‌న‌పు క‌లెక్ట‌ర్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img