కాకతీయ, సూర్యపేట: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపై కర్రలు, రాళ్లతో బీహార్ కార్మికులు దాడికి దిగారు. బీహార్ కార్మికుల దాడిలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. నిన్న డెక్కన్ సిమెంట్లో పనిచేస్తున్న సమయంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు.
మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టే సమయంలో కార్మికులకు పోలీసులకి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులపై కార్మికులు దాడికి దిగారు.


