epaper
Thursday, January 15, 2026
epaper

అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలో హింస, కాల్పుల ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా రామయ్య బౌలికి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహమ్మద్ నిజాముద్దీన్‌ను స్థానిక పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగినప్పటికీ, రెండు వారాల తర్వాతే ఈ విషయం ఆయన కుటుంబానికి తెలిసింది. దీంతో బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

2016లో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిజాముద్దీన్, మొదట ఫ్లోరిడాలో చదువుకొని తర్వాత కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కొంతమంది స్నేహితులతో కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 3న రూమ్‌మేట్‌తో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చి, కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడని శాంటాక్లారా పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోగా, నిజాముద్దీన్ వారిని కత్తితో బెదిరించాడని తెలిపారు. దాంతో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని భావించి కాల్పులు జరిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించగా, ఆయన మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసుల కథనాన్ని ఖండిస్తున్నారు. “నా కుమారుడిని ఎందుకు కాల్చి చంపారు? వేరే మార్గం లేకపోయిందా?” అంటూ తండ్రి హుస్నుద్దీన్ ప్రశ్నించారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని, తన కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

ఇక మజ్లిస్ బచావోతహ్రీక్ (MBT) నేత అంజద్ ఉల్లా ఖాన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, మృతదేహాన్ని తెలంగాణకు రప్పించే చర్యలు తీసుకోవాలని ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. ఈ విషాద ఘటనతో నిజాముద్దీన్ కుటుంబం తీవ్ర వేదనలో ఉంది. అంత్యక్రియలు స్వదేశంలో జరపాలని కోరుతున్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img