కాకతీయ, నల్లబెల్లి : ప్రజలకు దగ్గరగా పరిపాలనను అందించడం, గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నల్లబెల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు.
తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ , ఎంపీడీవో కార్యాలయంలో పసరగొండ రవి జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజా పాలనలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను వివరించారు. ప్రభుత్వ పథకాల లక్ష్యం ప్రతి కుటుంబానికి చేరుకోవడమేనని తెలిపారు. ఈ సందర్భంగా సీట్లు పంపిణీ చేశారు. గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారులు జెండాలు ఆవిష్కరణ చేశారు.


