epaper
Monday, March 2, 2026
epaper

రూ.5వేల కోట్లతో హనుమకొండ, వరంగల్ అభివృద్ధి పనులు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, గత పదేళ్లలో కేవలం హామీలకే పరిమితమైన అభివృద్ధిని, ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనుల రూపంలో చూపిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి, అమరవీరుల త్యాగాలు, ప్రజా పాలన ప్రాముఖ్యత, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు.

హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో హనుమకొండ, వరంగల్ నగరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం దాదాపు రూ.5వేల కోట్లతో మౌలిక వసతుల పనులు చేపట్టింది. భవిష్యత్ జనాభా వృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూ. 4,100 కోట్లతో అండర్‌ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, భద్రకాళి దేవాలయ ఆధునీక రణలో భాగంగా మాడ వీధుల నిర్మాణం, పాత కలెక్టరేట్ బంగ్లా పునరుద్ధరణ పూర్తి దశలో ఉన్నాయని తెలిపారు.

జాతీయ రహదారి విస్తరణలో ఘనపూర్ – ఐనవోలు, ఒగ్లాపూర్ – ధర్మవరం రోడ్ల విస్తరణ పనులు పూర్తి అయ్యాయని, వంగర గ్రామంలో ఏడు కోట్లతో పి.వి. నరసింహారావు విజ్ఞాన వేదిక పనులు, పరకాలలో రూ. 35 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రెండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, హనుమకొండ లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదనల్లో ఉన్నాయి. కాలోజీ కళాక్షేత్రం పనులను పూర్తి చేసి ప్రారంభించడం ప్రభుత్వ పెద్ద విజయంగా నిలిచిందన్నారు. పర్యావరణం, వ్యవసాయం వన మహోత్సవంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గత ఏడాది 957 హెక్టార్లలో అడవుల పునరుద్ధరణ జరిగిందని, రైతులకు తగిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది 5వేల ఎకరాలలో పామ్ ఆయిల్ తోటలు సాగు చేస్తున్నారు. ప్రజలు కులమతాలకు అతీతంగా సమాన న్యాయం చేస్తూ, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి తెస్తామని తెలిపారు. ఎన్ఐటీ వద్ద మంత్రికి ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img