epaper
Saturday, November 15, 2025
epaper

భారతదేశాన్ని సూపర్ పవర్ గా మార్చడమే మోదీ లక్ష్యం.!!

కాకతీయ, వరంగల్ : భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందరమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఇందులో భాగంగానే అమెరికా ఎంత ఒత్తిడి చేసినా రైతుకు నష్టం కలిగించే పరికరాలను దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని వెల్లడించారు. దీంతో కక్ష కట్టిన అమెరికా ఇండియాపై ఎన్ని టారీఫ్ లు విధించినా భయపడకుండా రైతు క్షేమం కోసం పాటుపడుతున్నారని వివరించారు.

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నేటి నుంచి గాంధీ జయంతి లాల్, బహుదూర్ శాస్త్రి జయంతి ఆయన అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవాపక్ష కార్యక్రమాలను జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్, కో కన్వీనర్లు కర్నే రవీందర్, కొంతం సంగీత్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నేతలు బుధవారం పలుచోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

రక్తదానానికి యువత ముందుకు రావడం ఆనందంగా ఉందని రవికుమార్ వెల్లడించారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను నరేంద్ర మోడీ ప్రపంచానికి చాటుతూ, దేశ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారని తెలిపారు. ఎప్పటికైనా ప్రపంచానికి విశ్వ గురువుగా భారత్ నిలవడం ఖాయమని, అది నరేంద్ర మోడీ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ రాష్ట్రంలో పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతోనే స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా కుంటి సాకులతో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.

ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా అధిక సీట్లను బిజెపి గెలుచుకోవడం ఖాయమని గంట రవి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం సిగ్గుచేటని రవికుమార్ ధ్వజమెత్తారు. సర్కారు చేతగాని తనంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డుపై పడిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుంటే కళాశాలలను బంద్ చేస్తామని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నా డబ్బులు లేవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమేనని విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img