epaper
Thursday, January 15, 2026
epaper

రాజకీయాలకు అతీతంగా మహిళా డైరీ అభివృద్ధి..!!

కాకతీయ, గీసుగొండ: రాజకీయాలకు అతీతంగా మహిళా డైరీని అభివృద్ధి చేసుకుందామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.మండలం కేంద్రంలోని పి.ఎస్.ఆర్.గార్డెన్స్‌లో గీసుగొండ, సంగెం మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల ఈసి సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్ది, వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిజాయితీ, నిబద్ధత, మన పెట్టుబడి ఆధారంగా పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్‌ను దామెరలో ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. జనాభాలో సగం ఉన్న మహిళలను చైతన్యం చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి.

నర్సంపేటలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మహిళా సంఘాలను అభివృద్ధి పరిచా. అప్పట్లో మహిళలు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ప్రతీ కార్యక్రమంలో మహిళా ప్రాధాన్యం ఎంతో ఆవశ్యకమైందని అన్నారు. మహిళలకు నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి మహిళలను వృత్తి వ్యాపార పరంగా శక్తివంతంగా మార్చ పోతున్నామని అన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఆర్థికాభివృద్ధి, పశు పోషకులకు న్యాయమైన ఆదాయం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ డైరీ స్థాపన ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించుకోవడం, శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయడం, ముల్కనూరు సహకార డైరీ సహకారం పొందడం వంటి దశలను పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఆరు మండలాలను కలుపుకొని దామెరలో ఏర్పాటు కాబోతున్న ఈ డైరీ, రాజకీయాలకు అతీతంగా మహిళల సహకారంతో ఉన్నత స్థాయిలో ఎదుగుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశం కల్పిస్తే ఏ స్థాయిలో అభివృద్ధి సాధించగలరో పరకాల మహిళా బ్యాంక్ నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ, జడ్పీసీఈఓ రాం రెడ్డి,డిపిఎం వరలక్ష్మి,ఏపీడి రేణుకా దేవి,జిల్లా పశు వైద్యాధికారి బాలకృష్ణ,తహసిల్దార్ రియాజుద్దీన్,ఇన్చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఏపీఎం ఈశ్వర్, మండల సమైక్య అధ్యక్షురాలు గట్టు రజిత, స్వయం సహాయక సంఘాల సీసీలు, సిఏలు, సభ్యురాల్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img