కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో యువతి మరణించింది. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు.
వీరంతా కలిసి సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని సౌమ్యారెడ్డిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


