epaper
Saturday, November 15, 2025
epaper

కోట భూములు క‌బ్జా..!!

మ‌ట్టి, రాతి కోట‌ల్లో వంద‌ల సంఖ్య‌లో అక్ర‌మ నిర్మాణాలు

అన్యాక్రాంతమ‌వుతున్న కోట్ల విలువ చేసే భూములు

ఆక్ర‌మ‌ణ‌లో రైతులు, గుడిసెవాసులు..

బినామీల పేర్ల‌తో రాజ‌కీయ నేత‌లు

పురావ‌స్తు శాఖ అధికారుల మొద్దు నిద్ర‌

ఉన్న‌తాధికారుల ఆదేశాల అమ‌లులో నిర్ల‌క్ష్యం

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్‌లోని పురావ‌స్తుశాఖ ప‌రిధిలోని కాక‌తీయుల‌ మ‌ట్టి, రాతి కోట‌ల భూములు అన్యాక్రాంత‌మ‌వుతున్నాయి. రెండు కోట‌లను క‌బ్జాదారులు ఆక్ర‌మించేస్తున్నారు. ఏడాదికేడాది ఈ రెండు కోట‌ల భూముల‌ను ఆక్ర‌మిస్తూ.. అక్ర‌మ నిర్మాణాలు వెలుస్తున్నాయి. మ‌ట్టి, రాతి కోట‌ల చుట్టూ వంద‌ల సంఖ్య‌లో అక్ర‌మ నిర్మాణాలు వెలుస్తున్న పురావ‌స్తు, రెవెన్యూ శాఖ‌ల అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. కాకతీయులు శత్రువుల నుంచి సామ్రాజ్యాన్ని,  ప్రజలను రక్షించుకోవడానికి ఖిలా వ‌రంగ‌ల్ చుట్టూరా  ఏడు కోటలను నిర్మించారు.

అందులో ప్ర‌ధాన‌మైన‌వి రాతికోట, మట్టి కోట, పుట్టకోట, జలకోట, కంపకోటలు. కట్ట మైసమ్మ, మొగిలిచర్ల, కనపర్తి తదితర ప్రాంతాల్లో ఉన్న పుట్టకోట ఇప్ప‌టికే పూర్తిగా అన్యాక్రాంత‌మైంది. శివారు ప్రాంతంలోని రైతులు, కొంత రాజ‌కీయ నేత‌లు,  ఆక్ర‌మించేశారు. ఇక‌ ఖిలా వరంగల్ మట్టి కోట చుట్టూ సుమారు 7.5 కిలోమీటర్ల మేర, రాతికోట చుట్టూ నాలుగు కిలోమీటర్లు కందకాలు తవ్వి చెరువులు కుంటలను ఏర్పాటు చేశారు. రాతి, మట్టి కోటల చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు రాజకీయ నాయకుల కబ్జాతో పేదల కోసం వేస్తున్న గుడిసెలతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి.

1000 సంవత్సరాల చరిత్ర..!

1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుత కట్టడాలు, నిర్మాణాలు, శిల్ప సంపదలు కలిగిన ఖిలా వరంగల్ కోట చుట్టూ గుడిసెలు, బహుళ అంతస్తులను నిర్మిస్తున్నా.. నివారించడంలో పురావ‌స్తు శాఖ అధికారులు వైఫ‌ల్యం చెందుతున్నారు. మట్టి కోట అవతల శివనగర్ ప‌క్క‌న‌ ప్రాంతంలో సీపీఎం , సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో 20 ఎకరాలు, ఏసి రెడ్డి నగర్ లో 10 ఎకరాలు, మైసయ్య నగర్, అలాగే చింతల్ ప్రాంతంలో 20 ఎకరాలు, శంభునిపేట ప్రాంతాలలో గుడిసెలు వెలిశాయి. ప్రభుత్వ స్థలం సుమారు 60 ఎకరాలలో గుడిసెలు వెలిశాయి.

ఖిల్లా వరంగల్ రాతి, మట్టి కోటకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా వంద‌లాది ఇళ్ల నిర్మాణం జ‌రుగుతోంది. 2010 పురావస్తు శాఖ ఆక్ట్ ప్రకారం పురావస్తు కట్టడాల సమీపంలో 100 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా గుర్తించారు. ఆ తర్వాత 101 నుంచి 200 మీటర్ల ప్రాంతం వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి తీసుకొని ఇల్లు తదితర కట్టడాలను నిర్మించుకోవచ్చు. ఈ నిబంధ‌న‌లు అమ‌లు కావ‌డం లేదు. నిబంధనలకు విరుద్ధంగా కోట చుట్టూ ఇల్లు, గుడిసెలు వెలుస్తున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు.  ఫ‌లితంగా అలనాటి చారిత్రక కట్టడాలు కూడా కాలగర్భంలో కలిసిపోయే ద‌శ‌కు చేరుకున్నాయి.

ఆదేశాల‌ను అటెకెక్కించారు..!

ఓరుగల్లు కోటలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గ‌తంలో వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన‌ గోపి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయ‌న పురావస్తు శాఖ అధికారులు ,మున్సిపల్ కమిషనర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఖిలా వ‌రంగ‌ల్‌ కోటలో అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే కూల్చేయాలని ఆదేశించారు. అలాగే చట్ట ప్రకారం అనుమతులతో నిర్మాణాలు జ‌రిగేలాచూడాల‌ని జీడ‌బ్ల్యూఎంసీ క‌మిష‌న‌ర్‌ను ఆదేశించారు.

పురావస్తు శాఖ అధికారులు ఓరుగల్లు కోటను ప‌రిర‌క్షించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. దీనిపై చేద్దాం.. చుద్దాం అన్న‌ట్లుగా అధికారులు వ్య‌వ‌హ‌రించి మొత్తానికి ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపును అట‌కెక్కించారు. ప్ర‌స్తుత క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ స‌త్య‌శార‌ద అయినా దీనిపై దృష్టి పెట్టి కాక‌తీయుల సామ్రాజ్య‌పు ఆన‌వాళ్లు పూర్తిగా చెదిరిపోకుండా కాపాడాల‌ని వ‌రంగ‌ల్ ప్ర‌జ‌లు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img