epaper
Saturday, November 15, 2025
epaper

ఇది ధైర్యవంతుల నేల.. మీ వెంటే నేను.. మణిపూర్ హింస బాధితులతో ప్రధాని మోదీ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణిపూర్ స్ఫూర్తికి వందనం. మీ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రాష్ట్రం ఈశాన్యానికి ప్రకాశాన్ని జోడించే రత్నం అని అన్నారు. గతంలో హింస మణిపూర్‌ను కుదిపివేయడం బాధాకరమని, అయితే ఇప్పుడు ఆశ, విశ్వాసాల కొత్త ఉదయం ప్రారంభమవుతోందని తెలిపారు. కుకీలు, మెయిటీల మధ్య చర్చలు సాగుతున్నాయని, ప్రజలు శాంతి మార్గం వైపు అడుగులు వేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.

మణిపూర్ ప్రజలతో నేను ఉన్నాను. భారత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. నిర్వాసితుల కోసం రూ.500 కోట్ల ప్యాకేజ్ కేటాయించాం. మణిపూర్ అభివృద్ధి తిరిగి సరైన దారిలో పయనించేలా నేను కృషి చేస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు కొండ ప్రాంతాలు, గిరిజన సమాజం సహా మణిపూర్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మణిపూర్ ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కనెక్టివిటీ అని మోదీ గుర్తుచేశారు. గతంతో పోలిస్తే రైలు, రోడ్ల బడ్జెట్‌ను అనేక రెట్లు పెంచినట్లు చెప్పారు. వందలాది గ్రామాలకు రోడ్లు కల్పించారని, జిరిబామ్–ఇంఫాల్ రైల్వే లైన్ పూర్తయ్యాక రాజధాని ఇంఫాల్ దేశ రైల్వే నెట్‌వర్క్‌తో కలుస్తుందని తెలిపారు. కొండలు, లోయలలోని వివిధ సమూహాలతో ఇటీవల జరిగిన చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని ప్రధాని అన్నారు. సంభాషణ, పరస్పర గౌరవం, అవగాహనలతో శాంతి సాధ్యమని, అందరూ శాంతి మార్గంలో నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మణిపూర్‌లో ఉపాధి అవకాశాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రధాని తెలిపారు. గతంలో ఢిల్లీ నుంచి ప్రకటనలు మణిపూర్‌కి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టేవి. ఇప్పుడు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని అన్నారు. దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మించే పథకం కింద మణిపూర్‌లో కూడా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. 7–8 సంవత్సరాల క్రితం వరకు 25–30 వేల ఇళ్లకే పైపుల ద్వారా నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 3.5 లక్షల ఇళ్లకు పైపుల నీటి సౌకర్యం కల్పించామని వివరించారు.

కొండ ప్రాంతాల్లో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు కల అనిపించేవని ప్రధాని గుర్తుచేశారు. అయితే చురచంద్‌పూర్‌లో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పిఎం-దేవైన్ పథకం కింద ఐదు కొండ జిల్లాల్లో ఆధునిక ఆరోగ్య సేవలను అభివృద్ధి చేస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక్క మణిపూర్‌లోనే 2.5 లక్షల రోగులు ఉచిత చికిత్స పొందారని వివరించారు. మొత్తం మీద ప్రధాని మోదీ ప్రసంగంలో మణిపూర్ అభివృద్ధి, శాంతి, ఉపాధి, ఆరోగ్య సదుపాయాలపై స్పష్టమైన దిశను సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాక‌తీయ‌, జాతీయం: బీహార్ అసెంబ్లీ...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌! ఫరీదాబాద్ మాడ్యూల్...

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే...

ఎన్‌డీఏదే బీహార్… మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం

ఎన్‌డీఏదే బీహార్ ప‌నిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు మహాఘట్...

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! కాక‌తీయ‌, జాతీయం : దేశ...

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా? కాక‌తీయ‌, జాతీయం : దేశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img