epaper
Saturday, November 15, 2025
epaper

కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా, దక్షిణ భారత కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాసర నుంచి భద్రాచలం వరకు ధర్మపురి, కాళేశ్వరం వంటి ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండేందున, ముందుగా వీటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఆలయాల అభివృద్ధితో పాటు శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

శాశ్వత మౌలిక వసతులు..

మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవహించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం ఉండగా, దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఒకేసారి రెండు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, వసతి, ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు శాశ్వత ప్రాతిపదికన కల్పించాలని సీఎం ఆదేశించారు.

గతంలో మహా కుంభమేళా, పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి వంటి విస్తృత అనుభవం కలిగిన కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఎం సూచించారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రతి ఆలయాన్ని సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు రూపకల్పన చేయాలని ఆదేశించారు.

కేంద్ర పథకాల వినియోగం

గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటినీ సమన్వయంతో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు మరిన్ని పథకాల సహకారంతో పనులు చేపట్టాలని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.

పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img