epaper
Monday, March 2, 2026
epaper

దీపిక ఆసుప‌త్రి ముందు డీవైఏఫ్ఐ, ఏఐవైఎఫ్ గిరిజ‌న సంఘం నాయ‌కుల ధ‌ర్నా .. !!

కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ః- దీపిక హాస్ప‌ట‌ల్‌ను మూసివేసి ఆస్ప‌త్రి నిర్వ‌హ‌కుల‌పై వెంట‌నే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ గిరిజన సంఘాల నాయ‌కులు డిమాండ్ చేశారు. వైద్యం కోసం వచ్చిన మ‌హిళ‌కు మ‌త్తు ఇచ్చి అత్యాచారం చేసిన కౌంపౌండ‌ర్, ఆసుప‌త్రి నిర్వ‌హ‌కుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు సోమ‌వారం రోజున క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని దీపిక ఆసుప‌త్రి ముందు ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయ‌కులు భీమా సాహెబ్, తిరుప‌తి, యుగంద‌ర్‌, రాజు నాయ‌క్‌లు మాట్ల‌డుతూ.. న‌గ‌రం న‌డి ఒడ్డులో ఉన్న దీపిక ఆసుప‌త్రిలో జ్వ‌రంతో భాద‌ప‌డుతూ ఆసుప‌త్రికి వ‌చ్చిన మ‌హిళ‌కు మ‌త్తు మందు ఇచ్చి, లైంగిక దాడికి పాల్ప‌డి అత్యాచారం చేసిన కాంపౌండ‌ర్ ద‌క్షిణ‌పై, ఆసుప‌త్రి నిర్వ‌హ‌కులు డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి త‌క్ష‌ణ‌మే రిమాండ్ చేయాల‌ని, ఆసుప‌త్రిక రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేసి ఆసుప‌త్రిని మూసి వేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

ఆస్ప‌త్రిలో అర్హులైన సిబ్బందిన పెట్ట‌కుండా అర్హ‌త లేని వారిని పెట్టి రోగుల ప్రాణాలో చెల‌గాట‌మాడుతున్న హాస్ప‌ట‌ల్ యాజ‌మాన్యం పై త‌క్ష‌ణ‌మే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మహిళ పై లైంగిక దాడి, అత్యాచారం చేసినా నిందితున్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేసి నిందితుడిని శిక్ష పడే విధంగా జిల్లా అధికారులు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఆస్పత్రి నిర్వహకులు నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న నిర్వాహకులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని వారు కోరారు.

జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం, శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం వలన వైద్య శాఖ అధికారుల వైఫల్యం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఆస్ప‌త్రి నిర్వ‌హకులు అనుమ‌తి తీసుకోకుండా అనుమ‌తి కొర‌కు చేసిన ద‌ర‌ఖాస్త‌ల ద్వారానే ఆసుప‌త్రులు ప్రారంభింస్తున్నార‌ని, ఆపరేష‌న్లు చేసి వైద్యం విక‌టించి ప్రాణాలు కోల్పోతున్న రోగుల గురించి వైద్యాధికారుల దృష్టికి తీసుకుపోయిన నేటి వరకు చర్యలు తీసుకొన్న‌ దాఖలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సంతాన సౌపల్య కేంద్రాలు రకరకాల పేర్లు పెట్టుకుని అర్హులైన సిబ్బందిని పెట్టకుండా వైద్యాన్ని వ్యాపార పరం చేస్తున్న హాస్పటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంలో వైద్యాధికారులు ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.

పాలన అధికారులు, ప్రభుత్వాలు ఇప్పటికైనా నిజనిర్ధారణ కమిటీలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఇటువంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దీపిక హాస్పిటల్ అనుమతిని రద్దుచేసి ఆసుపత్రిని మూసివేసి నిందితుడ్ని, హాస్పిటల్ నిర్వ‌హ‌కుల‌ డాక్టర్ వెంకటేశ్వర్లు పై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింతం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ నాయక్, రవీందర్ నాయక్, లక్పతి నాయక్, భాస్కర్ నాయక్, రాజన్, చెంచర్ల మురళి, అవినాష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img