epaper
Saturday, November 15, 2025
epaper

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశం.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగా బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజలకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని గుర్తు చేశారు.

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో చరిత్రాత్మక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నుండి సన్నబియ్యం పంపిణీ వరకు అనేక పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. కామారెడ్డి లో జరిగే భారీ బహిరంగ సభలో లక్షల మంది పాల్గొని కాంగ్రెస్ శక్తిని చాటుతారని అన్నారు.

ఇక రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఓటు చోరీలపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నారని తెలిపారు. మోదీ, అమిత్ షా పదవే పరమావధిగా భావించి ఓటు దోపిడీకి పాల్పడతారని, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో దానికి ఉదాహరణ ఉందని అన్నారు. నైతిక విలువలు లేని ఈ చర్యలను రాహుల్ గాంధీ ఎప్పటికీ సహించరని స్పష్టం చేశారు. ఓటు చోరీల వల్లే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

ఉద్యోగాల విషయమై బీజేపీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వాస్తవానికి ఉద్యోగాల కల్పన పరిస్థితి దయనీయంగా ఉందని, ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు సమీపించగానే బీజేపీ నాయకులు దేవుళ్ల పేర్లు చెప్పి ప్రజలను మభ్యపెడతారని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా దేవుళ్ల పేర్లు వాడి గెలిచారని, కానీ దేవుళ్లకు బీజేపీ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని గట్టి విమర్శలు చేశారు.

2029 ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు. కవిత స్టేట్‌మెంట్‌తో కేసీఆర్ కుటుంబం దోపిడీ బట్టబయలైందని, కేసీఆర్ కుటుంబం దొంగల ముఠాగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్లలో డీజిల్ పోసుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం అవినీతి సొమ్ముతో వందల కోట్లకు పడగలెత్తిందని ఎద్దేవా చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. ప్రజలతో ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని, మీనాక్షి గాంధీ నిజాయితీకి నిలువెత్తు రూపమని కొనియాడారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img