కాకతీయ, నేషనల్ డెస్క్: మహారాష్ట్రలోని సముద్రతీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో అధికారులు హైలర్ట్ విధించారు. పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గాన్ బీచ్ లకు మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో భద్రతా, విపత్తు నిర్వహణ సంస్థలను అలర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని..అందులో ఏముందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో తీర గ్రామాలకు అలర్ట్ చేసి బీచ్ ల వెంబడి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టినట్లు తెలిపారు.
సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండటం వల్ల ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టంగా మారిందని..ఓ కంటైనర్ పాక్షికంగా మునిగిపోయిందని అధికారులు తెలిపారు. పోలీసులు, సముద్ర నిఘా అధికారులు, కోస్ట్ గార్డ్స్ సమన్వయంతో పనిచేస్తూ కంటైనర్లకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు షిప్పింగ్ లాంగ్స్, తీరప్రాంత నిఘా డేటా ద్వారా దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఆగస్టులో ఒమన్ నుంచి వెళ్తున్న ఓ కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటెయినర్లు సముద్రంలో జారిపడ్డాయని.. ప్రస్తుతం అవే కొట్టుకొచ్చినవి అయ్యింటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సముద్రతీరాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ముట్టుకోవద్దని స్థానిక మత్స్యకారులు, తీర ప్రాంతాల్లోని గ్రామస్తులకు సూచించారు.
ఆగస్టులో ఒమన్ నుంచి వెళ్తున్న ఓ కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటెయినర్లు సముద్రంలో జారిపడ్డాయి. కంటెయినర్లు అరేబియా సముద్రం గుండా మహారాష్ట్రలోని ఒడ్డుకు కొట్టుకువచ్చే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కంటెయినర్లను లేదా సంబంధిత వస్తువులను గుర్తిస్తే భారత నావికాదళానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక మత్స్యకారులు, తీర ప్రాంతాల్లోని గ్రామస్థులు, గస్తీ బ్రుందాలను అధికారులు సూచించారు.


