epaper
Saturday, November 15, 2025
epaper

ఐదు నెలల్లో 29 మంది మంది బలి.. గుంటూరు జిల్లా తురకపాలెం లో మరణాల మిస్టరీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామం ఇటీవల ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా దళితవాడలో గత అయిదు నెలల్లో అసాధారణంగా మరణాలు జరగడం గ్రామస్థులను, అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 29 మంది మృత్యువాత పడ్డారు. అయితే గ్రామస్థుల వాదన ప్రకారం అసలు సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. జులై, ఆగస్టు నెలల్లో మరణాలు ఎక్కువగా సంభవించాయి. యువకులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

గ్రామంలో పరిస్థితులు తీవ్రతరం కావడంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, ఆరోగ్యశాఖ అధికారులు తురకపాలెంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద కేసులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గ్రామంలో వంట చేయవద్దని, అక్కడి నీరు లేదా ఆహారం వాడవద్దని సూచనలు జారీ చేశారు. కొంతకాలం ప్రభుత్వం వారానికి మూడు పూటల భోజనం సరఫరా చేయాలని నిర్ణయించింది.

గ్రామస్థులు తమ అనుభవాలను పంచుకుంటూ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చెబుతున్నారు. నా తల్లి మొదట జ్వరంతో బాధపడింది. తరువాత కిడ్నీ సమస్యలు వచ్చాయని ఆసుపత్రిలో చెప్పారు. చికిత్స చేయించడానికి డబ్బులు సరిపోక చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది అని ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. మరొకరు తమ భర్త వారంలోనే ఆసుపత్రిలో మృతిచెందారని చెప్పారు. చిన్నపిల్లలకూ జ్వరం, కీళ్ల నొప్పులు రావడం, పాఠశాలకు వెళ్లలేకపోవడం వంటి సమస్యలు ఆందోళన పెంచుతున్నాయి.

ఈ మరణాలకు నీటి కాలుష్యం కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఒక సమయంలో గ్రామానికి సమీపంలోని ఓ క్వారీ గుంట నుంచి నీటిని సరఫరా చేయడం జరిగిందని, అది కలుషితమై ఉంటుందని మాజీ సర్పంచ్ ఆరోపించారు. అయితే అధికారులు ప్రస్తుతం బోర్‌వెల్ నీటినే వాడుతున్నారని, ట్యాంకులను శుభ్రపరిచారని చెబుతున్నారు.

మరోవైపు మద్యం దుర్వినియోగం కూడా కారణం కావచ్చని స్థానిక ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు భావిస్తున్నారు. చీప్ లిక్కర్ ఎక్కువగా తాగినవారికి ఇప్పుడు ప్రభావం చూపిస్తోందేమో అని ఆయన అన్నారు. అయితే మహిళలు కూడా మరణించిన నేపథ్యంలో ఇది పూర్తి కారణం కాదని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

కొంతమంది రోగులకు మెలియాయిడోసిస్ అనే అరుదైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండవచ్చని వైద్యులు అనుమానించారు. ఇది డయాబెటిస్, లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారిలో ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెప్పారు. అయితే ఇప్పటివరకు సేకరించిన రక్త నమూనాల్లో స్పష్టమైన ఆధారాలు లభించలేదని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. మరణాల వివరాలు ఉన్నతాధికారులకు చేరడంలో ఆలస్యం జరిగిందని అంగీకరిస్తున్నాం. నివేదికల ఆధారంగా అసలు కారణాలను బయటపెడతామని అని ఆయన చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img