epaper
Monday, March 2, 2026
epaper

ఐదు నెలల్లో 29 మంది మంది బలి.. గుంటూరు జిల్లా తురకపాలెం లో మరణాల మిస్టరీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామం ఇటీవల ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా దళితవాడలో గత అయిదు నెలల్లో అసాధారణంగా మరణాలు జరగడం గ్రామస్థులను, అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 29 మంది మృత్యువాత పడ్డారు. అయితే గ్రామస్థుల వాదన ప్రకారం అసలు సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. జులై, ఆగస్టు నెలల్లో మరణాలు ఎక్కువగా సంభవించాయి. యువకులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

గ్రామంలో పరిస్థితులు తీవ్రతరం కావడంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, ఆరోగ్యశాఖ అధికారులు తురకపాలెంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద కేసులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గ్రామంలో వంట చేయవద్దని, అక్కడి నీరు లేదా ఆహారం వాడవద్దని సూచనలు జారీ చేశారు. కొంతకాలం ప్రభుత్వం వారానికి మూడు పూటల భోజనం సరఫరా చేయాలని నిర్ణయించింది.

గ్రామస్థులు తమ అనుభవాలను పంచుకుంటూ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చెబుతున్నారు. నా తల్లి మొదట జ్వరంతో బాధపడింది. తరువాత కిడ్నీ సమస్యలు వచ్చాయని ఆసుపత్రిలో చెప్పారు. చికిత్స చేయించడానికి డబ్బులు సరిపోక చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది అని ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. మరొకరు తమ భర్త వారంలోనే ఆసుపత్రిలో మృతిచెందారని చెప్పారు. చిన్నపిల్లలకూ జ్వరం, కీళ్ల నొప్పులు రావడం, పాఠశాలకు వెళ్లలేకపోవడం వంటి సమస్యలు ఆందోళన పెంచుతున్నాయి.

ఈ మరణాలకు నీటి కాలుష్యం కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఒక సమయంలో గ్రామానికి సమీపంలోని ఓ క్వారీ గుంట నుంచి నీటిని సరఫరా చేయడం జరిగిందని, అది కలుషితమై ఉంటుందని మాజీ సర్పంచ్ ఆరోపించారు. అయితే అధికారులు ప్రస్తుతం బోర్‌వెల్ నీటినే వాడుతున్నారని, ట్యాంకులను శుభ్రపరిచారని చెబుతున్నారు.

మరోవైపు మద్యం దుర్వినియోగం కూడా కారణం కావచ్చని స్థానిక ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు భావిస్తున్నారు. చీప్ లిక్కర్ ఎక్కువగా తాగినవారికి ఇప్పుడు ప్రభావం చూపిస్తోందేమో అని ఆయన అన్నారు. అయితే మహిళలు కూడా మరణించిన నేపథ్యంలో ఇది పూర్తి కారణం కాదని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

కొంతమంది రోగులకు మెలియాయిడోసిస్ అనే అరుదైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండవచ్చని వైద్యులు అనుమానించారు. ఇది డయాబెటిస్, లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారిలో ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెప్పారు. అయితే ఇప్పటివరకు సేకరించిన రక్త నమూనాల్లో స్పష్టమైన ఆధారాలు లభించలేదని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. మరణాల వివరాలు ఉన్నతాధికారులకు చేరడంలో ఆలస్యం జరిగిందని అంగీకరిస్తున్నాం. నివేదికల ఆధారంగా అసలు కారణాలను బయటపెడతామని అని ఆయన చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img