కాకతీయ, నెల్లికుదురు: మానుకోట జిల్లా నెల్లికుదురు తెలంగాణ మోడల్ స్కూల్ లో టి.జి.టి సోషల్ బోధిస్తున్న అంజుంసుల్తానా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించారని ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు తెలిపారు.
గురువారం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నూతన సృజనాత్మక పద్ధతులలో బోధన చేయటం, విద్యార్థులకు మోటివేషనల్ గైడ్ గా వ్యవహరించటం, స్టేట్ రిసోర్స్ పర్సన్ గా సబ్జెక్టు పరమైన అన్ని శిక్షణ తరగతులకు హాజరై, ట్రైనీగా వ్యవహరిస్తూ, తెలుసుకున్న విషయాలను పాటిస్తూ బోధించటం, విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నందుకు గాను పీఎం శ్రీ విభాగంలో ఈ అవార్డును దక్కించుకున్నారని చెప్పారు.
పాఠశాల సర్వతోముఖాభివృద్ధిలోనూ, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పించుటలోను అంజుంసుల్తానా పాత్ర ప్రముఖమైనదని కొనియాడారు. ఆమెకు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.


