కాకతీయ, కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారంటూ గ్రానైట్ వ్యాపారులను ప్రశ్నించారు బండి సంజయ్, గ్రానైట్ వ్యాపారులతో బండి సంజయ్ ఈవ్యాఖ్యలు చేయడంతో గ్రైనేట్ అసోసియేషన్ నాయకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమాజానికి పనికి వచ్చే సేవ చేయరా అంటూ ప్రశ్నించారు.
తనపై నిందలేసినా మీరు ఖండించారా అని అడిగారు. చైనాతో సంబంధాలు మెరుగపరిచిన ప్రధానిమోదీ మీరు థ్యాంక్స్ చెప్పారా అంటూ నిలదీశారు. భయపడుతూ ఇంకెన్నాళ్లు వ్యాపారం చేస్తారు..స్వేచ్ఛగా వ్యాపారం చేసే పరిస్థితిని తాను కల్పిస్తానని బండి స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ చైనా పర్యటన చేయడంతో వ్యాపార సంబంధాలు మెరుగవుతున్నాయని గ్రానైట్ వ్యాపారులు తెలిపారు. సమాజానికి సేవ చేయాలని బండి సంజయ్ సూచించడంతో చేస్తామని సంఘం నేతలు చెప్పారు. అధికారులకు గ్రానైట్ వ్యాపారులు సహకరించాలని కోరారు బండిసంజయ్.


