epaper
Saturday, November 15, 2025
epaper

యూరియా కోసం చెప్పుల క్యూలు .. ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్కటే బస్తా.. కాకతీయ గ్రౌండ్ రిపోర్ట్

*“వేలిముద్ర లేక యూరియా బస్తా రాదు”
*రైతు కష్టానికి క్యూల కష్టం”
*యూరియా కోసం చెప్పుల క్యూలు – రైతుల దుస్థితి
*ఎకరానికి ఒక్క బస్తా – రైతుల నిరాశ
*ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్క బస్తా మాత్రమే

కాకతీయ, సంగెం (గ్రౌండ్ రిపోర్ట్): పంటల పెరుగుదల కోసం తప్పనిసరి అయిన యూరియా ఎరువు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం మొదలుకొని గంటల తరబడి సొసైటీ ముందు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. పరిస్థితి ఇంత దారుణంగా మారింది కాబట్టి, రైతులు తమ స్థానాన్ని నిలుపుకోవడానికి చెప్పులు పెట్టి క్యూలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పులే క్యూలు సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో యూరియా కోసం చెప్పులు లైన్ కట్టయి ప్రభుత్వం భూ కార్డు ఆధారంగా ఎకరానికి ఒక యూరియా బస్తా కేటాయించింది. కానీ ఇది రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. పంటలకు కావలసినంత ఎరువు అందకపోవడంతో పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“బస్తా కోసం రోజు మొత్తం లైన్లో ఉండాలి, లేదంటే మా వంతు రాదు. చెప్పులు పెట్టి లైన్ వేసుకోవడం తప్ప వేరే దారి లేదు” అని రైతులు వాపోతున్నారు. యూరియా పంపిణీలో వేలిముద్ర తప్పనిసరి చేశారు. వేలిముద్ర సరిపోకపోతే రైతులకు బస్తా ఇవ్వడం లేదు. దీంతో కొంతమంది రైతులు బస్తా తీసుకోలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

పోలీసుల ఫైన్ – రైతుల అసహనం:
ఒక వైపు ఎరువు కోసం రైతులు లైన్లలో నిలబడుతుంటే, మరోవైపు పోలీసులు ద్విచక్ర వాహనాలకు ఫైన్‌లు వేస్తుండటం రైతులను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. “యూరియా బస్తా కోసం పోరాడితే జరిమానా, ఇది ఏ న్యాయం?” అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

గతంలో లేని కొరత – ఇప్పుడు ఎందుకు?
గత పాలనల్లో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు రైతుల నోళ్లలో వినిపిస్తున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమా? అనే సందేహాలు కలుగుతున్నాయి. “అన్నం పెట్టే రైతు చెప్పుల క్యూలు వేసి ఎరువు కోసం వేచి ఉండటం రైతు గౌరవానికి తగినది కాదు” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత కేవలం ఒక ఎరువు సమస్య కాదు.. ఇది రైతు జీవనాధారం సమస్య. రైతు బతికితేనే దేశం బతుకుతుందన్న సత్యాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img