ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ..
అల్లం బాలకిషోర్ రెడ్డి చేసిన సామాజిక సేవలపై రూపొందించిన పుస్తకం విడుదల
కాకతీయ, గీసుగొండ: కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం కిశోర్ రెడ్డి–స్వప్న దంపతులు నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలపై రూపొందించిన ‘ఏబీఆర్ జనవందనం’ పుస్తకాన్ని మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు మర్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.అల్లం బాలకిషోర్ రెడ్డి గత నాలుగేళ్లుగా మండలంలోని పలు పేద కుటుంబాలు, నిరుపేద విద్యార్థులు, క్రీడాకారులు,దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల వివరాలను ఈ పుస్తకంలో పొందు పరచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ సర్పంచ్ వీరగొని రాజ్ కుమార్, రాంపూర్ సర్పంచ్ రడం భరత్ కుమార్, మనుగొండ సర్పంచ్ శ్రవణ్, సూర్య తండా సర్పంచ్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


