గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
పది లీటర్ల గుడుంబా, సామాగ్రి ధ్వంసం
దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి
కాకతీయ, దుగ్గొండి : గుడుంబా తయారీపై కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. అక్రమ సారాయి తయారీపై ఎక్కడైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. శుక్రవారం మండలంలోని ముద్దునూరు గ్రామ శివారులో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన బాలు గుడుంబా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో పది లీటర్ల గుడుంబాతో పాటు పానకం, సారాయి డ్రమ్ములు, బిందలు, ఇతర వస్తువులను పోలీసులు ధ్వంసం చేశారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా గుడుంబా తయారీ జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.


