కట్టెల పొయ్యే దిక్కు
హోటల్ నిర్వహణ కష్టమయ్యే
అయినా తప్పని వ్యాపార తిప్పలు
కాకతీయ , కూసుమంచి : సిలెండర్ కష్టాలు ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు.. యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా వంట గది నుండి హోటల్ వరకు సెలెండర్ల కొరతతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరా కు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం వంట గ్యాస్ , కమర్షియల్ గ్యాస్ కొరత ఉంది.. కూసుమంచి మండల కేంద్రంలోని ఓ హోటల్ లో తమ వ్యాపారానికి గ్యాస్ కష్టాలు మొదలవడంతో కట్టెల పొయ్యి మీదనే టిఫినీలు చేస్తూ వ్యాపారని కొనసాగిస్తున్నారు.. ఉదయం వ్యాపారం చేసుకునే మధ్యాహ్నం సమయంలో కట్టెల కోసం సుదూరం ప్రాంతాలకు వెళ్లి కట్టెలను సేకరిస్తున్నారు.. కట్టెల సేకరణ ఆగితే మరుసటి రోజు ఉదయం టిఫిన్ లు చేయడానికి ఇబ్బందులు తప్పదలేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.. ఎంతో మంది కస్టమర్లు తమ హోటల్ కి రెగ్యులర్ గా వస్తూ ఉంటారని ఒక్క రోజు టిఫిన్ లేకపోతే ఆరోజు ఆదాయంతో పాటు , కస్టమర్లను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.. ప్రభుత్వం తన కష్టాన్ని గుర్తించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అందించే ఏర్పాటు చేయాలని హోటల్ యజమాని కోరుతున్నారు.


