పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు పనిచేయడం వల్ల కార్మికుల త్వరగా అలసిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎండలు విపరీతంగా పెరిగినవి ఎండలను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్ గారు ఖమ్మం పారిశుద్ధ్య కార్మికులకు తెల్లవారుజామున నాలుగు గంటలకు విధులకు రమ్మని మధ్యాహ్నం 12 గంటలకు ముగించుకొని ఇళ్లల్లో పోయే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని టి యు సి ఖమ్మం నగర కార్యదర్శి కే శ్రీనివాస్ మరియు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిన్నెర నారాయణ మున్సిపల్ కమిషనర్ ని కోరారు.ఈరోజు ఖమ్మం కాల్వ ఒడ్డు ప్రాంతంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఎండలు విపరీతంగా పెరిగినవి త్వరగా అలసిపోయి వడదెబ్బకు గురై కార్మికులు అనారోగ్యం గురయ్యే అవకాశాలు ఉన్నవి కావున సంబంధిత అధికారులు కార్మికుల యొక్క శ్రమను దృష్టిలో పెట్టుకొని పనివేళల్లో మార్పు చేయాలని వారు ఖమ్మం కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.


