గుడుంబా తయారీపై దుగ్గొండి పోలీసుల దాడులు
పది లీటర్ల గుడుంబా, డ్రమ్ములు, వస్తువులు ధ్వంసం
కాకతీయ, దుగ్గొండి: మండలంలోని ముద్దునూరు గ్రామ శివారులో గుడుంబా స్థావరాలపై ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తన సిబ్బందితో కలసి శుక్రవారం దాడులు నిర్వహించారు. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన బాలు అనే వ్యక్తి మండలంలోని ముద్దునూరు గ్రామ శివారులో గుడుంబా తయారు చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి గుడుంబా తయారీకి ఉపయోగించే పానకం మరియు సారాయి డ్రమ్ములు, బిందలు, వస్తువులను తదితర సామాగ్రిని ధ్వంసం చేశారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రణధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలం లో ఎక్కడైనా గుడుంబా తయారు చేసినట్లయితే అట్టి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.


