రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం కొత్తగట్టు గ్రామానికి చెందిన మత్స్య గిరింద్ర స్వామి దేవస్థాన చైర్మన్ కోరెం రాజిరెడ్డి, దేవస్థానం డైరెక్టర్ మీస రవీందర్ ద్విచక్ర వాహనంపై కేశవపట్నం నుండి స్వగ్రామమైన కొత్తగట్టు గ్రామానికి తిరుగు ప్రయాణం క్రమంలో మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఇసుక లారీ వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మీస రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా, కోరం రాజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రాజిరెడ్డిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


