సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు ఆర్థిక భరోసా
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కాకతీయ,శంకరపట్నం : ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా ఆర్థిక సహాయం అందించడం వల్ల వారి జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అనంతరం గూడాటిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి, చింతగుట్ట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కే సురేఖ, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, పీసీసీ సభ్యులు, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, హుజురాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, యువ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


